





Best Web Hosting Provider In India 2024

పెద్ద సెలబ్రిటీల కంటే వారే పెద్దగా అనిపించారు.. అందుకే లక్ష విరాళం.. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7, 8 ద్వారా మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ నటించిన రెండో సినిమా సోలో బాయ్. రీసెంట్గాఆపరేషన్ సింధూర్లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతులమీదుగా సోలో బాయ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి గౌతమ్ కృష్ణ రూ. లక్ష విరాళం అందించాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ తెలుగు 7, 8 రెండు సీజన్లలో మంచి గేమ్ ఆడి ఆకట్టుకున్నాడు. అయితే, గౌతమ్ కృష్ణ హీరోగా చేసిన రెండో సినిమా సోలో బాయ్. పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి హీరోయిన్స్. నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు.
జవాన్ తల్లిదండ్రుల చేతుల మీదుగా
జూన్19న సోలో బాయ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదుగా సోలో బాయ్ ట్రైలర్ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్ కృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. “మా మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ చిత్ర కథ మధ్య తరగతి కుటుంబాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం. నా మొదటి సినిమా అంతగా ఆదరణ పొందని సమయంలో బిగ్ బాస్కు వెళ్లే ముందు నన్ను నేను అన్వేషించుకున్నాను. అలా బయట చాలా సాధారణంగా అన్ని ఎమోషన్స్ ఉండేలా ఒక చిత్రం చేయాలని అనుకున్నాను. ఆ విధంగా ఈ చిత్రం మొదలైంది” అని అన్నాడు.
ఎన్నో తరాల పాటు
“ఈ కథ విన్న వెంటనే సతీష్ గారు తనకు ఉన్న ప్యాషన్ సినిమాను ఓకే చేయడం జరిగింది. ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొడితే అది ఎన్నో తరాల పాటు గుర్తుంటుందని మేము నమ్మాము. మా చిత్రానికి పెద్దవారు ఎవరు పని చేయనప్పటికీ చిత్రంలో కంటెంట్ హీరోగా నిలుస్తుంది. ఈ సినిమాలో నేనే కాదు, నా పాత్ర ఎవరు పోషించినా కూడా సినిమా మంచి హిట్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ అలాంటిది” అని గౌతమ్ కృష్ణ తెలిపాడు.
“చిత్ర దర్శకుడు నవీన్ గారు సైలెంట్గా ఉండే వ్యక్తి అయినప్పటికీ ఎంతో ప్రతిభావంతులు. ఈ ట్రైలర్ను దయచేసి మీరంతా ప్రమోట్ చేయండి. కొత్ తవారిని ఎంకరేజ్ చేయండి” అని గౌతమ్ కోరాడు.
కుటుంబీకులే పెద్దగా
“ఈ కార్యక్రమానికి మురళి నాయక్ కుటుంబాన్ని ముఖ్య అతిథులుగా పిలవడానికి కారణమేంటంటే ఈ చిత్రంలో సబ్జెక్ట్ చాలా బలంగా ఉంటుంది. చాలా చిన్న వయసులో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ లాంటి వ్యక్తి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని తద్వారా వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని కోరుకున్నాము. మాకు పెద్ద పెద్ద సెలబ్రిటీల కంటే ఈ కుటుంబీకులే పెద్దగా అనిపించారు. అందుకే వారిని ఆహ్వానించాము” అని గౌతమ్ కృష్ణ చెప్పుకొచ్చాడు.
“నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ప్రేక్షకులు మాత్రమే. కాబట్టి ఇకపై వీరందరి కోసం ఏదో ఒకటి చేయాలని చాలా బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. సమవర్తి అనే ట్రస్టు ద్వారా నాకు వచ్చే ప్రతి సంపాదనలోనూ సగం ఆ ట్రస్టుకు అందజేయాలని నిర్ణయించుకున్నాను” అని గౌతమ్ పేర్కొన్నాడు.
భవిష్యత్తులో కూడా
“అలాగే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులో సగం ఆ ట్రస్టు ద్వారా ముందుగా ఒక లక్ష రూపాయలు మురళి నాయక్ గారి కుటుంబానికి అందజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ద్వారా వీలైనంత మందికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. ప్రతి నెల నేను ఆ ట్రస్ట్ ద్వారా చేసే సహాయాన్ని నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెడతాను” అంటూ గౌతమ్ కృష్ణ తన స్పీచ్ ముగించాడు.
సంబంధిత కథనం