ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ తెలుగు, తమిళ బైలింగువల్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కలియుగం 2064 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 8.2 రేటింగ్ వచ్చింది. మరి కలియుగం 2064 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ ఎన్నో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, తెలుగు, తమిళం భాషల్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు రావడం చాలా అరుదు. కానీ, 2025లో రీసెంట్‌గా ఓ బైలింగువల్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. అదే కలియుగం 2064.

ఆహారం, నీళ్ల కోసం

మూడో ప్రపంచ యుద్దం తర్వాత ఆహారం, నీళ్ల కోసం ప్రజలు కొట్టుకుంటారు. వీరిని కంట్రోల్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. మనుషులను చంపి వారి వద్ద నుంచి ఆహారం లాక్కునే మరో గ్రూప్ కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకచోట సేఫ్ హౌజ్ ఉందని తెలుస్తుంది. ఆ సేఫ్ హౌజ్‌ గురించి తెలిసిన శక్తి అక్కడే నివసిస్తుంటాడు.

సేఫ్ హౌజ్‌లోకి భూమి

అయితే, ఓ రోజు ఆ సేఫ్ హౌజ్‌లోకి భూమి అనే అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శక్తి, భూమి మధ్య నెలకొన్న పరిస్థితులు ఏంటీ? చివరికి ఏమైంది? అనే అంశాలతో కలియుగం 2064 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ ప్రమోద్ సుందర్ కథ, దర్శకత్వం వహించారు.

శ్రద్ధా శ్రీనాథ్ సినిమాలు

తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకే కాలంలో తెరకెక్కిన కలియుగం 2064 సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఇనియన్ సుబ్రమణి, ఆర్య లక్ష్మీ ఇతర కీలక రోల్స్‌లో నటించారు. శ్రద్ధా శ్రీనాథ్ ఇదివరకు తెలుగులో జెర్సీ, డాకు మహరాజ్, మెకానిక్ రాకీ వంటి పలు సినిమాల్లో అలరించింది.

కలియుగం రేటింగ్

ఈ ఏడాది మే 9న థియేటర్లలో విడుదలైన కలియుగం 2064 మూవీ పర్వాలేదనిపించుకుంది. అయితే, ఐఎమ్‌డీబీ సంస్థ నుంచి పదికి ఏకంగా 8.2 రేటింగ్‌ను సొంతం చేసుకుంది కలియుగం 2064. కాస్తా సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉన్న కలియుగం 2064 ఓటీటీలోకి ఇవాళ (జూన్ 20) వచ్చేసింది.

కలియుగం ఓటీటీ

సింప్లీ సౌత్ ఓటీటీలో కలియుగం 2064 డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో సింప్లీ సౌత్‌లో నేటి నుంచి కలియుగం 2064 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో మిస్ అయిన ఈ సినిమాను ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

జిన్ ది పెట్ ఓటీటీ

దీంతోపాటు ఇవాళ ఓటీటీలోకి తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ జిన్ ది పెట్ కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 8 రేటింగ్ ఉంది. అయితే, సన్ నెక్ట్స్‌లో జిన్ ది పెట్ ఓటీటీ రిలీజ్ అయింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024