



Best Web Hosting Provider In India 2024
‘‘అవును.. కాల్పుల విరమణ కోసం మేమే అభ్యర్థించాం’’- ఎట్టకేలకు బహిరంగంగా ఒప్పుకున్న పాకిస్తాన్
ఇటీవలి భారత్, పాకిస్తాన్ దాడుల విషయంలో ఎట్టకేలకు అసలు వాస్తవాన్ని పాకిస్తాన్ అంగీకరించింది. కాల్పుల విరమణ కోసం తామే భారత్ ను అభ్యర్థించామని బహిరంగంగా వెల్లడించింది. భారత వైమానిక దాడుల్లో తమ కీలక ఎయిర్ బేస్ లు ధ్వంసమయ్యాయని ఒప్పుకుంది.
భారత్, పాకిస్తాన్ ల మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణపై పాకిస్తాన్ ఎట్టకేలకు నోరు విప్పి వాస్తవాలను వెల్లడించింది. తమ రెండు కీలక వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత తప్పనిసరై తామే కాల్పుల విరమణను కోరామని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా రావల్పిండి, పంజాబ్ ప్రావిన్స్ లోని నూర్ ఖాన్, షోర్ కోట్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసిందని దార్ ఓ టీవీ న్యూస్ షోలో చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
సౌదీ యువరాజు ఫైజల్ ఫోన్
టీవీ న్యూస్ షోలో దార్ మాట్లాడుతూ ‘‘దురదృష్టవశాత్తూ భారత్ మే10 తెల్లవారుజామున 2.30 గంటలకు మరోసారి క్షిపణి దాడులు చేసింది. నూర్ ఖాన్ వైమానిక స్థావరం, షోర్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేశారు. ఆ దాడుల్లో ఆ రెండు ఎయిర్ బేస్ లు ధ్వంసమయ్యాయి. ఆ తరువాత, 45 నిమిషాల్లో సౌదీ యువరాజు ఫైజల్ నాకు ఫోన్ చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో నేను జరిపిన సంభాషణ గురించి తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. కాల్పుల విరమణ గురించి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో మాట్లాడాలా? అని అడిగారు. నేను వెంటనే, అవునని అన్నాను. ‘‘బ్రదర్, మీరు చేయగలరు’’ అన్నారు. ఆ తరువాత కాసేపటికి మళ్లీ ఫోన్ చేసి ఇదే విషయాన్ని జైశంకర్ కు తెలియజేశానని చెప్పారు.’’ అని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ వెల్లడించారు.
ఆపరేషన్ సింధూర్
ఏప్రిల్ 22న 26 మందిని పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్‘ కింద భారత్ కచ్చితమైన దాడులు నిర్వహించింది. మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై దాడికి పాక్ ప్రయత్నించింది. వైమానిక స్థావరాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లతో సహా అనేక కీలకమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలకు భారీ నష్టం కలిగించడం ద్వారా పాకిస్తాన్ ప్రయత్నాలకు భారతదేశం గట్టిగా ప్రతిస్పందించింది.
మే 10న కాల్పుల విరమణ
ఆ తరువాత, మే 10వ తేదీన భూ, వాయు, సముద్రంపై అన్ని కాల్పులు, సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని భారత్, పాకిస్థాన్ ఒక అవగాహనకు వచ్చాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. భారత్ లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయా?, దాడులు మళ్లీ కొనసాగుతాయా? అన్న ప్రశ్నకు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ స్పందిస్తూ, అందుకు చాలా తక్కువ అవకాశాలున్నాయన్నారు. అయితే, భారత్ అందుకు పాల్పడితే, తగిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
Best Web Hosting Provider In India 2024
Source link