





Best Web Hosting Provider In India 2024

యోగా ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసిన మారుతి.. మణిశర్మ సంగీతం.. ఏ మతం లేదంటూ ది రాజా సాబ్ డైరెక్టర్ కామెంట్స్
ప్రభాస్ ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా యోగా ఆంథెమ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్ను ఇవాళ (జూన్ 21) ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మెలొడీ బ్రహ్మ మణిశర్మ కంపోజిషన్లో అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్ను ప్రముఖ దర్శకులు మారుతి రిలీజ్ చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
యోగా గొప్పదనం గురించి
ఈ కార్యక్రమంలో ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్, ప్రభాస్ ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యోగా గొప్పదనం గురించి వివరించారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “యోగా గురించి మాట్లాడాలంటే చాలా అర్హత కావాలి. యోగా ఆంథెమ్ సాంగ్ను నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రధాని మోదీ గారు యోగా డేను సెలబ్రేట్ చేస్తున్నారు. విశాఖలో ఆయన యోగా డే సెలబ్రేషన్స్కు హాజరవుతున్నారు” అని తెలిపారు.
ఇషాన్ క్రియేషన్స్ అశోక్
“ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఏపీలో జరుగుతున్న యోగాంధ్ర సెలబ్రేషన్స్లో ఈ యోగా ఆంథెమ్ ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోవడం సంతోషకరం. ఈ పాట ద్వారా ఇషాన్ క్రియేషన్స్ అశోక్ గారు మోదీ గారిని కలిసే అవకాశం దక్కించుకున్నారు” అని మారుతి చెప్పారు.
“యోగాకు ఏ మతం లేదు. అందరూ ఆరోగ్యం కోసం యోగాను ప్రాక్టీస్ చేయాలి. మనకు అతి తక్కువ ఖర్చుతో చేసుకునే వ్యాయామం యోగా. ఈ పాటకు మణిశర్మ గారు అద్భుతంగా సంగీతం అందించి కంపోజ్ చేశారు. అనంత శ్రీరామ్ గారు అందరికీ అర్థమయ్యేలా మంచి లిరిక్స్ రాశారు” అని మారుతి అన్నారు.
నష్టాలు చూశారు
“అశోక్ డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్లో నష్టాలు వచ్చి కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత సెలూన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టి మంచి పొజిషన్కు వచ్చారు. అలాగే అన్ని శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు తిరిగి, యోగా గురించి తెలుసుకుని, యోగాకు ప్రచారం చేస్తున్నారు. వారు ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా” అని దర్శకుడు మారుతి చెప్పుకొచ్చారు.
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. “మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. అలా మనసు, శరీరాన్ని కలిపే శక్తి యోగాకు ఉంది. ఏ పేటెంట్ లేకుండా మనం ప్రపంచానికి అందించిన బహుమతి యోగా” అని అన్నారు.
సంస్కృత పదాలు ఉపయోగించి
“ఈ పాటను అన్ని భాషల వారికీ అర్థమయ్యేలా రాయాలని అనుకున్నాను. అందుకే ఎక్కువగా సంస్కృత పదాలు ఉపయోగించి రాశాను. సంస్కృతాన్ని దైవ భాష అని అంటారు. ఈ పాట రూపకల్పన చేసి నాతో పాట రాయించాలని అశోక్ గారు అనుకున్నందుకు థ్యాంక్స్” అని అనంత శ్రీరామ్ తెలిపారు.
“యోగాకు ప్రచారం కల్పిస్తూ దానికి ఒక ప్రత్యేకమైన రోజును ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం లోక కల్యాణానికి మంచిది.యోగాకు ప్రాధాన్యత ఇస్తున్న మన నాయకులు అందరికీ ధన్యవాదాలు” అని పాటల రచయిత అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం