




Best Web Hosting Provider In India 2024

లక్ష కోట్ల క్రైమ్ థ్రిల్లర్.. కుబేర సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. ధనుష్, నాగార్జున మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
కుబేర బాక్సాఫీస్ కలెక్షన్ డే 1: భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైన కుబేర మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఆడియన్స్ మౌత్ టాక్ తో మూవీకి జనాలు క్యూ కడుతున్నారు. మరి కుబేర మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇక్కడ చూద్దాం.
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేర చిత్రం ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ రిలీజ్ ల్లో ఒకటిగా నిలిచింది. ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫీల్ గుడ్ సినిమాలు తీసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా రావడం, ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో కుబేరపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరి జూన్ 20న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఫస్ట్ డే ఎన్ని కోట్లు రాబట్టింది? ఇక్కడ చూద్దాం.
మంచి ఓపెనింగ్స్
ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ కుబేర సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఇండియాలో తొలి రోజు రూ.13 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైంది ఈ సినిమా. అయితే స్టార్ కాస్ట్, స్టోరీ లైన్ చూసుకుంటే ఇండియా వైడ్ గా కుబేర సినిమాకు ఫస్ట్ రోజు వచ్చిన కలెక్షన్లు తక్కువే అని చెప్పొచ్చు.
రాయన్ కు రూ.15.7 కోట్లు
ధనుష్ గత చిత్రం రాయన్ కంటే కుబేర మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు తక్కువే కావడం గమనార్హం. రాయన్ సినిమాకు తొలి రోజు రూ.15.7 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. కుబేర ఫిల్మ్ కు శుక్రవారం మొత్తం తెలుగు ఆక్యుపెన్సీ 57.36 శాతంగా నమోదైంది. మార్నింగ్ షోలకు 38.94 శాతం, మధ్యాహ్నం షోలకు 54.58 శాతం ఆక్యుపెన్సీ ఉంది. సాయంత్రం షోల సంఖ్య 57.04 శాతానికి పెరిగింది. హిందీలో ఆమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాతో కుబేరకు పోటీ ఎదురవుతోంది.
పాజిటివ్ టాక్
పాజిటివ్ టాక్ తో కుబేర వీకెండ్ లోకి అడుగుపెట్టింది. దీంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ కలెక్షన్లు పెరిగే అవకాశముంది. అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జిమ్ సర్భ్ కూడా నటించారు. శుక్రవారం చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ లో ధనుష్, ఆయన కుమారుడు లింగ ఈ చిత్రాన్ని మొదటి రోజు, ఫస్ట్ షో ద్వారా వీక్షించారు. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఎమోషనల్ గా కనిపించారు ధనుష్.
మరో వీడియోలో అభిమానులు తన కోసం కేకలు వేయడం, గోడలు ఎక్కి ఆయనను చూసేందుకు చేతులు ఊపడంతో భావోద్వేగానికి లోనయ్యారు. జనాన్ని అదుపు చేసేందుకు ఆయన భద్రతా సిబ్బంది ప్రయత్నించడం, ప్రజలను కిందికి దిగమని కోరడం కనిపించింది. ఒరిజినల్ కట్ నుంచి 19 సన్నివేశాలను కట్ చేయడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) యూఏ సర్టిఫికేట్ తో పాన్ ఇండియా రిలీజ్ కు అనుమతి ఇచ్చింది. దీంతో 13 నిమిషాల 41 సెకన్ల సినిమా కట్ అయింది.
సంబంధిత కథనం
టాపిక్