పైలట్ ‘మేడే కాల్’.. బెంగళూరు విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Best Web Hosting Provider In India 2024


పైలట్ ‘మేడే కాల్’.. బెంగళూరు విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Sudarshan V HT Telugu

గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం పైలట్ మేడే కాల్ ఇవ్వడంతో అత్యవసరంగా బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఇంధనం తక్కువగా ఉండడంతో పైలట్ ఈ మేడే కాల్ ఇచ్చారు.

బెంగళూరు విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (ANI Grab)

గువాహటి నుంచి చెన్నైకి 168 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో తగినంత ఇంధనం లేదంటూ కెప్టెన్ ‘మేడే’ కాల్ ఇవ్వడంతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదానికి కొద్దిసేపటి ముందు కూడా పైలట్ మేడే కాల్ జారీ చేసిన విషయం తెలిసిందే.

గువాహటి నుంచి చెన్నైకి

గౌహతి నుంచి శనివారం సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం 6ఈ-6764 (ఏ321) పైలట్ రాత్రి 7:45 గంటలకు చెన్నైలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే విమానం ల్యాండింగ్ గేర్ రన్ వేను తాకడంతో పైలట్ ‘బాల్డ్ ల్యాండింగ్’గా పిలిచే ప్రాంతంలో ‘గో ఎరౌండ్’ను ఎంచుకున్నాడు. అనంతరం, మరోసారి ల్యాండింగ్ కు ప్రయత్నించకుండా బెంగళూరు వైపు వెళ్లి, బెంగళూరు విమానాశ్రయానికి 35 మైళ్ల దూరంలో ‘మేడే’ ఫోన్ చేశాడు. అకస్మాత్తుగా, విమానం ఒక్కసారిగా నిట్ట నిలువుగా పైకి లేవడంతో చాలా మంది ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారని ఓ ప్రయాణికుడు తెలిపారు. పైలట్ చెన్నైలో రెండోసారి ల్యాండింగ్ కు ప్రయత్నించలేదని ఎయిర్ పోర్టు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వర్గాలు ధృవీకరించాయి. బదులుగా, అతను విమానాన్ని బెంగళూరుకు మళ్లించాలని నిర్ణయించుకున్నాడని తెలిపాయి.

పైలట్ల తొలగింపు

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, “మేడే కాల్ వచ్చిన తరువాత, ఏటీసీ క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసింది. వైద్య, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రాత్రి 8.20 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన అనంతరం, ఇండిగో యాజమాన్యం ఇద్దరు పైలట్లను విధుల నుంచి తొలగించింది. ఇంధనం తక్కువగా ఉన్న ఇండిగో విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయింది.

శుక్రవారం మరో విమానంలో..

శుక్రవారం మదురై వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి చెన్నై వెళ్లేందుకు అనుమతి కోరారు. సుమారు 68 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, సరైన భద్రతా ప్రోటోకాల్స్ పాటిస్తూ ప్రయాణికులందరినీ దింపామని తెలిపారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link