




Best Web Hosting Provider In India 2024
ఇంగ్లాండ్ బజ్బాల్ బ్యాటింగ్.. డకెట్, పోప్ హాఫ్ సెంచరీలు.. వికెట్ల కోసం ఇండియా ఫైటింగ్.. బుమ్రానే దిక్కు
టీమిండియా టాప్ ఆర్డర్ దెబ్బకు వణికిపోయినా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది ఇంగ్లాండ్. బౌలింగ్ లో భారత స్పీడ్ కు బ్రేక్ వేయడమే కాకుండా.. బ్యాటింగ్ లోనూ బజ్బాల్ దూకుడుతో సాగిపోతోంది. డకెట్, పోప్ హాఫ్ సెంచరీలు బాదేశారు.
ఇంగ్లాండ్ బజ్బాల్ బ్యాటింగ్ తో తొలి టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియాతో లీడ్స్ లో జరుగుతున్న ఈ ఫస్ట్ టెస్టులో బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ దూసుకెళ్తోంది. తన స్టైల్లో దూకుడుగా ఆడుతోంది. బజ్బాల్ బ్యాటింగ్ తో స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తోంది. శనివారం (జూన్ 21) తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 34 ఓవర్లు పూర్తయ్యే సరికి 138/2తో నిలిచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 471 పరుగులకు ఆలౌటైంది.
ఫస్ట్ ఓవర్లోనే వికెట్
వర్షం అంతరాయం కారణంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభం కాస్త ఆలస్యమైంది. వరుణుడు వెళ్లిపోయి ఆట తిరిగి స్టార్ట్ కాగానే బుమ్రా చెలరేగాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే క్రాలీ (4)ని ఔట్ చేశాడు. స్లిప్ లో కరుణ్ నాయర్ పట్టిన క్యాచ్ లో క్రాలీ పెవిలియన్ వెళ్లిపోయాడు. ఇలాంటి స్టార్ట్ దొరికిన తర్వాత భారత బౌలర్లు చెలరేగిపోతారనిపించింది. కానీ డకెట్ (62; 94 బంతుల్లో 9 ఫోర్లు), ఓలీ పోప్ కలిసి కౌంటర్ ఎటాక్ చేశారు. భారత పేసర్లపై బౌండరీలతో దాడికి దిగారు.
పరుగులే పరుగులు
సాధారణంగా టెస్టుల్లోనూ ధనాధన్ బ్యాటింగ్ ఆడుతుందని ఇంగ్లాండ్ కు పేరుంది. ఆ టీమ్ బజ్బాల్ బ్యాటింగ్ గురించి తెలిసిందే. ఇప్పుడు ఇండియాపై తొలి ఇన్నింగ్స్ లో ఆ టీమ్ బ్యాటర్లు డకెట్, పోప్ అలాగే రెచ్చిపోయారు. ఓ దశలో అయితే ఓవర్ కు ఆరుకు పైగా రన్ రేట్ తో పరుగులు రాబట్టారు. బుమ్రా ఒక్కడే బౌలింగ్ లో ఎఫెక్టివ్ గా కనిపించగా.. సిరాజ్ ఫర్వాలేదనిపించాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ను చిత్తుచిత్తుగా కొట్టారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. తన ఫస్ట్ స్పెల్ లో 5 ఓవర్లు వేసిన ప్రసిద్ధ్ ఏకంగా 32 పరుగులిచ్చేశాడు.
పార్ట్నర్షిప్ బ్రేక్
రెండో వికెట్ కు డకెట్, పోప్ కలిసి 122 పరుగులు జోడించారు. అయితే ఈ జోడీ మరింత డేంజరస్ గా మారుతున్న సమయంలో ఆపద్బాంధవుడు బుమ్రా మరోసారి టీమిండియాను ఆదుకున్నాడు. అద్భుతమైన డెలివరీతో డకెట్ ను బౌల్డ్ చేశాడు. కానీ రూట్ తో కలిసి పోప్ పోరాటం కొనసాగించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో 34 ఓవర్లు ముగిసే సరికి పోప్ 62 పరుగులతో, రూట్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
471 ఆలౌట్
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు (జూన్ 20) ఆటలో యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ సెంచరీలు చేయగా.. రెండో రోజు రిషబ్ పంత్ హండ్రెడ్ సాధించాడు. కానీ ఓ దశలో 430/3తో పటిష్ఠంగా నిలిచిన భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. 41 పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link