




Best Web Hosting Provider In India 2024
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్లతో.. ఇరాన్పై అమెరికా దాడి!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచే విధంగా.. ఇరాన్లోని 3 అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివతమైన బీ-2 బాంబర్లను వినియోగించింది.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా, తన ప్రపంచంలోనే అత్యంత శక్తివతమైన బీ-2 బాంబర్లను ఉపయోగించి ఇరాన్లోని 3 అణు స్థావరాలపై దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించింది. ఫొర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని అణు స్థావరాలపై దాడులు విజయవంతమైనట్టు ఆయన పేర్కొన్నారు.
“ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అనే మూడు అణు స్థావరాలపై మా దాడులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు అన్ని విమానాలు ఇరాన్ గగనతలం నుంచి బయటపడ్డాయి. ప్రధాన స్థావరమైన ఫోర్డోపై పూర్తిస్థాయి బాంబుల వర్షాన్ని కురిపించాం. అన్ని విమానాలు సురక్షితంగా తమ స్థావరాలకు తిరిగి వెళుతున్నాయి,” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“మా గొప్ప అమెరికన్ యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే సైన్యం కూడా ఇలా చేయలేదు. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైంది! ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు,” అని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు.
బీ-2 బాంబర్లు వినియోగం..
ప్రపంచంలోనే అత్యంత శక్తివతమైన బీ-2 స్టెల్త్ బాంబర్లను ఈ దాడుల్లో ఉపయోగించినట్లు ఒక అమెరికా అధికారి రాయిటర్స్కు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి, మిస్సోరీలోని వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి అనేక బీ-2 బాంబర్లు టేకాఫ్ అయి పశ్చిమం వైపు వెళ్లినట్లు అగ్రరాజ్య మీడియా నివేదించింది. శనివారం నాటికి, ఈ విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతూ కనిపించాయి. అవి గువామ్కు వెళుతున్నట్లు సమాచారం.
బీ-2 స్పిరిట్ బాంబర్లు 30,000-పౌండ్ల “బంకర్ బస్టర్” బాంబును మోసుకెళ్లగలవని సీఎన్ఎన్ నివేదించింది. ఇరాన్లోని పటిష్టమైన ఫోర్డో అణు స్థావరాన్ని ఛేదించగల ఏకైక ఆయుధం ఇదేనని నమ్ముతున్నారు. ప్రతి బీ-2 బాంబర్ ఇలాంటి రెండు ఆయుధాలను మోసుకెళ్లగలదు!
ఈ బీ-2 బాంబర్లను సాధారణ రేడార్లు పసిగట్టలేవు. దీని ఫ్లయింగ్-వింగ్ డిజైన్, రాడార్-శోషక పదార్థాలు, లో ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ కారణంగా, దీని రాడార్ క్రాస్-సెక్షన్ సుమారు 0.001 చదరపు మీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ఒక చిన్న పక్షికి సమానమైనది.
ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు..
జూన్ 13న ఇరాన్ అణు- సైనిక మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో ఘర్షణ తీవ్రమైంది. ఈ దాడుల్లో ఇరాన్కి చెందిన పలువురు అగ్రశ్రేణి సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇరాన్.. డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుంది.
శుక్రవారం రాత్రి, ఇజ్రాయెల్ మరిన్ని దాడులను నిర్వహించింది. ఇస్ఫహాన్ అణు కర్మాగారం, నైరుతి ఇరాన్లోని అదనపు సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. శనివారం నాటికి, ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్తో సంభావ్య “దీర్ఘకాల యుద్ధానికి” సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link