




Best Web Hosting Provider In India 2024
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో బిగ్ అప్డేట్- ఆ ఇద్దరు అరెస్ట్..!
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్ట్లకు ఈ ఇద్దరు ఆశ్రయం కల్పించినట్టు సమాచారం!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్ ఉగ్రదాడి కేసులో బిగ్ అప్డేట్! ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు బృందం).. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసింది. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఈ ఇద్దరు ఆశ్రయం కల్పించారు.
ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ఆ ఇద్దరు ఎవరు?
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఉగ్రవాదులు టూరిస్ట్లు ఉన్న చోటకు చొరబడి కాల్పులకు తెగించారు. పురుషులను.. వారి మతం అడిగి మరీ కాల్చిచంపారు. మహిళలను విడిచిపెట్టి “వెళ్లి మోదీకి చెప్పు” అని అన్నారు. ఈ ఉగ్రదాడిలో 26మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి, ధ్వంసం చేసింది. తదనంతర పరిణామాలతో ఇరు దేశాలు యుద్ధం అంచువరకు వెళ్లాయి. చివరికి, కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితులు శాంతించాయి.
కాగా.. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. పహల్గామ్లోని బాట్కోటె, హిల్ పార్క్లో నివాసముండే పర్వీజ్ అహ్మద్ జాథోర్, బషీర్ అహ్మద్ జాథోర్లను ఎన్ఐఏ తాజాగా అరెస్ట్ చేసింది. వీరిని విచారించగా.. ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్ట్లలో ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, ఆ ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందినవారని వెల్లడించినట్టు తెలుస్తోంది.
వచ్చిన వారు ఉగ్రదాడికి పాల్పడుతున్నారని తెలిసి కూడా పర్వీజ్, బషీర్లు వారికి ఆశ్రయం ఇచ్చారు. హిల్ పార్క్లోని ఒక స్థావరంలో వారికి ఆహారం, షెల్టర్, లాజిస్టిక్స్ని అందించారు. అక్కడి నుంచే ఉగ్రవాదులు పహల్గామ్కు వెళ్లి మారణకాండకు పాల్పడ్డారు.
యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 19 (ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం) కింద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.
షోపియాన్, కుల్గామ్, పుల్వామా, సోపోర్, కుప్వారా సహా 32 లొకేషన్స్లో వారాల పాటు ఎన్ఐఏ దాడులు నిర్వహించిన అనంతరం ఈ అరెస్ట్లు చేసింది. ఉగ్రవాద సంస్థలకు సాయం చేస్తున్న అండర్గ్రౌండ్ వర్కర్లను పట్టుకునేందుకు ఈ దాడులు జరిగాయి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link