





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.230కోట్ల థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
రైడ్ 2 సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. సూపర్ హిట్ అయిన ఈ సీక్వెల్ మూవీ ఈవారంలోనే స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు ఇవే..
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గణ్ ప్రధాన పాత్ర పోషంచిన రైడ్ 2 చిత్రం మంచి హిట్ సాధించింది. ఈ ఏడాది మే 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్టే కలెక్షన్లను బాగానే దక్కించుకుంది. 2018లో వచ్చిన రైడ్కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కింది. రైడ్ 2 చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
స్ట్రీమింగ్ వివరాలివే
రైడ్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ఫ్లిక్స్ ఓటీటీ దగ్గర ఉన్నాయి. ఈ సినిమాను ఈ శుక్రవారం జూన్ 27వ తేదీన స్ట్రీమింగ్కు తీసుకొచ్చేందుకు ఆ ప్లాట్ఫామ్ రెడీ అయిందని సమాచారం బయటికి వచ్చింది. తేదీపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత రైడ్ 2 చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. మే 1న రిలీజైన ఈ చిత్రం.. జూన్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇవ్వనుంది. థియేట్రికల్ రన్లో ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
కలెక్షన్లు ఇలా..
రైడ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం సుమారు రూ.230కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా దాదాపు రూ.120కోట్లతో రూపొందినట్టు అంచనా. ఆరంభం నుంచి మంచి టాక్తో ఈ చిత్రం కమర్షియల్ హిట్ సాధించింది.
ఐటీ రైడ్ చుట్టూ
రైడ్ 2 చిత్రంలో అమయ్ పట్నాయక్ అనే ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారిగా అజయ్ దేవ్గణ్ నటించారు. రైడ్కు కొనసాగింపుగానే ఈ మూవీ వచ్చింది. దాదా మనోహర్ బాయ్ అనే రాజకీయ నాయకుడి ఇంటిపై జరిగే ఐటీ రైడ్, ఆ తర్వాత జరిగే పరిణామాల చుట్టూ రైడ్ 2 మూవీ సాగుతుంది. ఈ చిత్రాన్ని థ్రిల్లర్లా గ్రిప్పింగ్గా తెరకెక్కించారు డైరెక్టర్ రాజ్ కుమార్.
రైడ్ 2 మూవీలో అజయ్ దేవ్గణ్తో పాటు రితేశ్ దేశ్ముఖ్, వాణి కపూర్, రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, సుప్రియా పాఠక్, అమృత్ సియాల్, బిజేంద్ర కాలా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని టీ సిరీస్ ఫిల్మ్స్, పనోరమ స్టూడియోస్ పతాకాలపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ ప్రొడ్యూజ్ చేశారు. రైడ్ 3 చిత్రం కూడా ఉంటుందని ఈ మూవీ చివర్లో మేకర్స్ హింట్ కూడా ఇచ్చేశారు.
సంబంధిత కథనం