విజయ్ దేవరకొండపై పోలీసు కేసు.. ఆదివాసులపై వ్యాఖ్యల వివాదం.. ఆ కామెంట్లు వైరల్

Best Web Hosting Provider In India 2024

విజయ్ దేవరకొండపై పోలీసు కేసు.. ఆదివాసులపై వ్యాఖ్యల వివాదం.. ఆ కామెంట్లు వైరల్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆదివాసుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.

విజయ్ దేవరకొండ (PTI)

రెట్రో చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో ఆదివాసుల గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా నటుడు విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం (జూన్ 22) పీటీఐకి ధ్రువీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పహల్గాంలో జరిగిన తాజా ఉగ్రవాద దాడిని 500 సంవత్సరాల క్రితం జరిగిన తెగల మధ్య ఘర్షణలతో పోల్చిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఫిర్యాదు మేరకు జూన్ 17న ఎస్సీ/ఎస్టీ చట్టం కింద విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు.

ఫిర్యాదు చేసిందెవరంటే?

“నటుడు విజయ్ దేవరకొండ ఏప్రిల్‌లో వ్యాఖ్యలు చేశారు. అయితే, ఫిర్యాదు ఆధారంగా జూన్ 17న ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు” అని పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ రాష్ట్ర అధ్యక్షుడు నెనవత్ అశోక్ కుమార్ నాయక్ (అశోక్ రాథోడ్) ఫిర్యాదు చేశారు. సూర్య నటించిన రెట్రో చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో నటుడు చేసిన వ్యాఖ్యలు ఆదివాసీ సమాజాల భావాలను దెబ్బతీశాయని, తీవ్రమైన అవమానం కలిగించాయని ఆయన ఆరోపించారు. ఆదివాసులను పాకిస్థానీ ఉగ్రవాదులతో పోల్చడం జాతి వివక్షగా ఉందని రాథోడ్ అన్నారు.

విజయ్ కామెంట్లు

సూర్య నటించిన రెట్రో చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో పహల్గాం ఉగ్రవాద దాడి గురించి విజయ్ మాట్లాడుతూ.. “కశ్మీర్‌లో జరుగుతున్న దానికి పరిష్కారం వారిని (ఉగ్రవాదులను) చదువుకోమని చెప్పడం. వారు ఏమి సాధిస్తారు? కశ్మీర్ భారతదేశానికి చెందినది, కశ్మీరు వారు మనవారు. భారతదేశం పాకిస్థాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాకిస్థానీలు స్వయంగా తమ ప్రభుత్వంపై అసంతృప్తి చెందుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వారు వారిపై దాడి చేస్తారు. అసలు 500 సంవత్సరాల క్రితం తెగలు కొట్టుకున్నట్లు, వీళ్ళు బుద్ధి లేకుండా, కనీసం సామాన్య జ్ఞానం లేకుండా చేసే పనులు ఇవి” అని అన్నారు.

సారీ కూడా

తన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత విజయ్ దేవరకొండ విచారం వ్యక్తం చేశాడు. ఎక్స్‌లో “రెట్రో ఆడియో లాంచ్ ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలు కొంతమంది ప్రజలలో ఆందోళన కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ప్రాముఖ్యంగా మన షెడ్యూల్డ్ తెగలను ఎంతో గౌరవిస్తా. వారు మన దేశంలో అంతర్భాగమని భావిస్తా. ఏ సమాజాన్ని కూడా నేను బాధించాలని లేదా లక్ష్యంగా చేసుకోవాలని ఎటువంటి ఉద్దేశం లేదు’’ అని సారీ చెప్పాడు విజయ్ దేవరకొండ.

“నా కామెంట్లలో ఏ భాగం అయినా తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే లేదా బాధ కలిగించినట్లయితే నేను నా హృదయపూర్వక విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. నా ఉద్దేశం శాంతి, ప్రగతి, ఐక్యత గురించి మాట్లాడటమే” అని విజయ్ ముగించాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024