





Best Web Hosting Provider In India 2024

ఆ డైరెక్టర్కు సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను.. హీరోయిన్ రష్మిక మందన్నా కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. నాగార్జున, ధనుష్తో కలిసి రష్మిక నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. జూన్ 20న రిలీజైన కుబేర సూపర్ హిట్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో కుబేర సక్సెస్ మీట్లో రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
కుబేర బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమా బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ను ఇటీవల గ్రాండ్గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరైన ఈ వేడుకలో నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
నా జర్నీలో పార్ట్ అయ్యారు
హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చిరు గారు నా జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు. థాంక్ యు సర్. ఈ సినిమా కథ విన్న తర్వాత సెట్స్కు వెళ్లి డైరెక్టర్ గారికి సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను. ఆయన ఎలా చెబితే అలా పర్ఫార్మ్ చేయాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పింది.
మరో లెవెల్కు తీసుకెళ్లారు
“ఈ రోజు సమీర పాత్రకు వచ్చిన క్రెడిట్ డైరెక్టర్ గారికే దక్కుతుంది. ఇలాంటి క్యారెక్టర్ రావడం నా అదృష్టం. ధనుష్ గారు, నాగార్జున గారు, శేఖర్ గారు ఈ సినిమాకి పిల్లర్స్. దేవీ శ్రీ గారు మ్యూజిక్తో మరో లెవల్కి తీసుకెళ్లారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు” అని హీరోయిన్ రష్మిక మందన్నా తెలిపింది.
లవ్ స్టోరీ అప్పుడు కూడా
ఇదే ఈవెంట్లో నిర్మాత పుష్కర్ రామ్ మోహన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన చిరంజీవి గారికి థాంక్ యూ. మంచి సినిమాకి ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. లవ్ స్టోరీ సినిమా అప్పుడు కూడా వచ్చారు. ఇప్పుడు కుబేర వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని చెప్పారు
ఎంతో ఆనందంగా ఉంది
సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. కుబేర సినిమా కోసం అన్ని డిపార్ట్మెంట్స్ అద్భుతంగా పని చేశాయి. ఈ సెలబ్రేషన్స్లో చిరంజీవి గారు భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది” అని అన్నారు.
అద్భుతమైన ఎక్స్పీరియెన్స్
“ధనుష్ గారు, నాగార్జున గారితో కలిసి వర్క్ చేయడం అద్భుతమైన ఎక్స్పీరియెన్స్. ఇంత పెద్ద కాన్వాస్ ఇచ్చిన శేఖర్ గారికి ధన్యవాదాలు. నిర్మాతలు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని డీవోపీ నికేత్ బొమ్మి చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం