కుబేర బ్లాక్‌బస్టర్.. మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ.80 కోట్ల మార్క్ దాటేసిన నాగార్జున, ధనుష్ మూవీ

Best Web Hosting Provider In India 2024

కుబేర బ్లాక్‌బస్టర్.. మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ.80 కోట్ల మార్క్ దాటేసిన నాగార్జున, ధనుష్ మూవీ

Hari Prasad S HT Telugu

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన కుబేర మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల మార్క్ అందుకుంది. తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ తో మూడో రోజు ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగాయి.

కుబేర బ్లాక్‌బస్టర్.. మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ.80 కోట్ల మార్క్ దాటేసిన నాగార్జున, ధనుష్ మూవీ

కుబేర మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ ను మరోసారి నిలబెట్టింది. కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇండస్ట్రీకి ఈ సినిమా కొత్త ఊపిరిలూదింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.80 కోట్ల మార్క్ అందుకుంది.

కుబేర బ్లాక్‌బస్టర్

కుబేర మూవీ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. మూడోరోజైన ఆదివారం (జూన్ 22) ఇండియాలోనే రూ.19 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇది ఒక రోజు సాధించిన అత్యధిక మొత్తం కావడం విశేషం. మూడో రోజు తెలుగులో రూ.12.4 కోట్లు, తమిళంలో 4.5 కోట్లు వసూలు చేసింది.

దీంతో మూడు రోజులు కలిపి ఇండియా నెట్ వసూళ్లు రూ.49 కోట్లు దాటాయి. సోమవారం (జూన్ 23) రూ.50 కోట్ల నెట్ కలెక్షన్ల మార్క్ కూడా అందుకోబోతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్రాస్ వసూళ్లు రూ.80 కోట్ల మార్క్ అందుకుంది. ఇండియాలోనే గ్రాస్ వసూళ్లు రూ.55 కోట్లుగా ఉంది.

తెలుగు వెన్షన్ నుంచే ఎక్కువగా..

కుబేర పాన్ ఇండియా రిలీజ్ అయినా.. దీనిని తెలుగు, తమిళంలలో ఒకేసారి షూట్ చేశారు. దీంతో ప్రధానంగా ఈ రెండు వెర్షన్ల నుంచే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. తెలుగులోనూ తొలి మూడు రోజులు కలిపి ఇండియా నెట్ వసూళ్లు రూ.34 కోట్లుగా ఉన్నాయి.

ఇక తమిళంలో రూ.13.65 కోట్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ నైజాం ఏరియాలో మరింత దూసుకెళ్తోంది. మూడు రోజులు కలిపి నైజాం నుంచే రూ.9.5 కోట్లు రావడం విశేషం. కొన్నాళ్లుగా తెలుగులో పెద్ద హిట్ లేదు. ఇప్పుడా లోటును కుబేర తీర్చింది.

కుబేర మిలియన్ టికెట్ల మార్క్

ఇక కుబేర మూవీ కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. తొలి షో నుంచే అన్ని వైపుల నుంచీ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఆ ప్రభావం టికెట్ల అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది. రోజురోజుకూ టికెట్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి.

సోమవారం అయినా కూడా తిరుపతిలో ఒక థియేటర్లో హౌస్‌ఫుల్ బోర్డు ఉన్న ఫొటోను కుబేర మూవీ టీమ్ తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇక బుక్ మై షోలో ఈ సినిమా ఇప్పటికే మిలియన్ టికెట్ల మార్క్ కూడా దాటేసింది. ఈ విషయాన్ని కూడా ఆ మూవీ టీమ్ కన్ఫమ్ చేసింది.

ఆదివారమే (జూన్ 22) కుబేర టీమ్ సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. సినిమాను ఆకాశానికెత్తాడు. ముఖ్యంగా ధనుష్, నాగార్జున, రష్మిక నటనను ప్రశంసించాడు. ఇలాంటి మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తే ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించవచ్చన్న నమ్మకాన్ని కుబేర మూవీ కలిగించిందని చిరు అన్నాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024