ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ – తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

Best Web Hosting Provider In India 2024

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ – తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు సదరన్‌ పార్ట్‌ అలైన్‌మెంట్‌కి ఆమోదముద్ర వేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు సచివాలయం ఎదురుగా రైతు నేస్తం సభ జరగనుంది. రాష్ట్రంలో మరో రెండు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ కేబినెట్‌ సుదీర్ఘంగా కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న రీజనల్ రింగ్ రోడ్డు పనుల నిర్మాణ కోసం మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై సుదీర్ఘ చర్చ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్‌కు ఈ నెల 30లోగా పూర్తి వివరాలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ కేబినెట్ భేటీ – నిర్ణయాలు:

  • మంగళవారం రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహణ ఉంటుంది. కేబినెట్ మంత్రులు అందరూ హాజరు అవుతారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు , గ్రామాల్లో కూడా సంబరాలు నిర్వహించాలని నిర్ణయం.
  • రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ లలో తెలంగాణ తల్లి విగ్రహం, నవంబర్ 9 లోపు ఏర్పాటుకు నిర్ణయం.
  • RRR చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు ఉన్న రీజినల్ రింగ్ రోడ్డు కు ఆమోదం.
  • బనకచర్ల ప్రాజెక్ట్ పై కేబినెట్ సుదీర్ఘ చర్చ. గోదావరి వాటా విషయంలో ఒక్క చుక్క కూడా వదులుకోవద్దని నిర్ణయం. దీనికోసం ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.
  • BRS ఉండగానే బనకచర్ల మొదలైందని మంత్రి పొంగులేటి తెలిపారు. పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో ప్రజా ప్రతినిదులు అందరితో మళ్లీ ఒక ప్రజెంటేషన్ ఉంటుందని చెప్పారు.
  • విభజన సమస్యల పై ఇప్పటికే ఉన్న కమిటీలతో త్వరలోనే హై లెవల్ మీటింగ్ కు కేబినెట్ నిర్ణయం.
  • కొత్త క్రీడా పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం
  • నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశం కావాలని నిర్ణయం. ఈ సమావేశాల ప్రోగ్రెస్ పై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష.
  • జిన్నారం , ఇస్నాపూర్ లను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Ts CabinetCm Revanth ReddyRegional Ring RoadHyderabadPonguleti Srinivas ReddyBanakacherla Project
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024