ట్రంప్‌నకు సమాధానం ఇచ్చేందుకు ఇరాన్ రెడీ అవుతుందా? ఈ కీలక నిర్ణయం తీసుకోనుందా?

Best Web Hosting Provider In India 2024


ట్రంప్‌నకు సమాధానం ఇచ్చేందుకు ఇరాన్ రెడీ అవుతుందా? ఈ కీలక నిర్ణయం తీసుకోనుందా?

Anand Sai HT Telugu

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యలోకి అమెరికా వెళ్లడంతో పరిస్థితులు మారిపోయాయి. మరోవైపు మధ్యప్రాచ్యంలోని అమెరికన్ స్థావరాలపై దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (REUTERS)

ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు స్థావరాలపై అమెరికా దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అమెరికా దాడికి తాము బలమైన ప్రతిస్పందన ఇస్తామని ఇరాన్ తెలిపింది. ఇరాన్ మధ్యప్రాచ్యంలోని తమ సైనిక స్థావరాలపై దాడి చేయగలదని అమెరికా భావిస్తోంది.

ఆదివారం తెల్లవారుజామున అమెరికా.. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు.. ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్‌లను నాశనం చేసింది. ఇరాన్ సైన్యానికి కొత్త చీఫ్ అయిన మేజర్ జనరల్ అమీర్ హతామి మాట్లాడుతూ.. ‘మేం అమెరికాను చాలాసార్లు ఎదుర్కొన్నా్ం. వారు మనపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, బలమైన స్పందన వచ్చింది. మన సైనికులలో చాలా మంది అమరులయ్యారు. మేం పూర్తి బలం, ధైర్యంతో పోరాడుతాం.’ అని అన్నారు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రాచ్యంలోని అమెరికన్ దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడిని ప్రారంభించవచ్చని ఇద్దరు అమెరికన్ అధికారులు తెలిపారు. ఈ దాడికి అమెరికా సిద్ధంగా ఉందని వారు చెప్పారు. ఈ కీలక నిర్ణయం ఇరాన్ తీసుకుంటే పరిస్థితులు దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది.

సిరియాలోని అమెరికన్ ఆర్మీ స్థావరంపై ఇరాన్ దాడి చేసిందని ఆరోపణలు వస్తున్న తరుణంలో అమెరికన్ అధికారుల ఈ ప్రకటన వెలువడింది. అమెరికా చర్యకు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి అధికారిక ధృవీకరణ లేదు. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు లేదా మరణించినట్లు వార్తలు లేవు.

మెహర్ న్యూస్ ప్రకారం, సిరియాలోని పశ్చిమ హసకా ప్రావిన్స్‌లోని ఒక ప్రాంతంలో ఒక అమెరికన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్ మోర్టార్లతో ఈ దాడి చేసింది. ఆ తర్వాత ఆర్మీ బేస్ ప్రవేశ ద్వారం వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అయితే అధికారిక ధృవీకరణ మాత్రం లేదు.

ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలైన ఫోర్డో, ఎస్ఫహాన్, నటాంజ్‌లపై అమెరికా దాడి చేసింది. ఈ దాడి తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి, ఘర్షణను ముగించడానికి అంగీకరించాల్సి ఉంటుందని అన్నారు. దీనితో పాటు ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే.. మరిన్ని దాడులు జరుగుతాయని ట్రంప్ బెదిరించారు.

మరోవైపు ఇజ్రాయెల్.. ఇరాన్‌లోని ఆరు విమానాశ్రయాలపై వైమానిక దాడులు చేసింది. మషద్, టెహ్రాన్, డెజ్‌ఫుల్, షాహిద్ బఖ్తియారి, తబ్రిజ్, హమదాన్‌లను లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్ దాడుల సహాయంతో 15 ఇరానియన్ సైనిక విమానాలు, హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తన ప్రకటనలో తెలిపింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link