భక్తులకు శుభవార్త – ఇకపై సులభంగా తిరుమల శ్రీవారి లడ్డూలు…! ఈ ప్రాసెస్ తెలుసుకోండి

Best Web Hosting Provider In India 2024

భక్తులకు శుభవార్త – ఇకపై సులభంగా తిరుమల శ్రీవారి లడ్డూలు…! ఈ ప్రాసెస్ తెలుసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. లడ్డూల పొందే విషయంలో సరికొత్త సేవలను ప్రారంభించింది. సులభంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా సూచించింది.

శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కోనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది.

ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ చేసేలా అవకాశం కల్పించడం జరిగింది. యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటుచేసింది.

కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం:

  • భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్తారు.
  • యంత్రంలో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. (1)దర్శన టికెట్ ఉన్నవారు, (2)దర్శన టికెట్ లేనివారు.
  • దర్శన టికెట్ ఉన్నవారు: కియోస్క్ యంత్రంలో ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది. టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి రెండు అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.
  • దర్శన టికెట్ లేనివారు: ఈ ఆప్షన్ ఎంచుకుని సరైన(verified) ఆధార్ నంబర్ ఇవ్వాలి. ఈ మార్గం ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.
  • సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు.
  • చెల్లింపు అనంతరం ముద్రిత రశీదు అందుతుంది.
  • ఆ రశీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు.

భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుండి విశేష స్పందన లభిస్తోందని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

TtdTirumalaAndhra Pradesh NewsDevotional
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024