దారుణం- నీట్​ మాక్​ టెస్ట్​లో తక్కువ మార్కులు వచ్చాయని.. కూతురిని కొట్టి చంపేసిన తండ్రి!

Best Web Hosting Provider In India 2024


దారుణం- నీట్​ మాక్​ టెస్ట్​లో తక్కువ మార్కులు వచ్చాయని.. కూతురిని కొట్టి చంపేసిన తండ్రి!

Sharath Chitturi HT Telugu

నీట్​ మాక్​ టెస్ట్​లో తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో సొంత కూతురిని కర్రతో దారుణంగా కొట్టాడు ఓ తండ్రి. ఆమె ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలో జరిగింది ఈ ఘటన.

కూతురిని కొట్టి చంపిన తండ్రి!

మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! నీట్​ మాక్​ టెస్ట్​లో తక్కువు మార్కులు వచ్చాయన్న కారణంతో సొంత కూతురిని దారుణంగా కొట్టి చంపేశాడు ఓ తండ్రి. అనంతరం పోలీసుల వద్ద నేరాన్ని అంగీకరించాడు.

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర సాంగ్లీలో కొన్ని రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. సాధ్న భోన్స్​లే ఒక టాపర్​! క్లాస్​ 10 బోర్డు పరీక్షల్లో 92.60శాతం సాధించింది. అనంతరం ఎంబీబీఎస్​ చేసేందుకు బైపీసీలో చేరింది. కాగా ఇటీవలే ఆమె నీట్​ (నేషనల్​ ఎలిజిబిలిటీ కమ్​ ఎంట్రెన్స్​ టెస్ట్​) మాక్​ టెస్ట్​ రాసింది. ఆ ప్రాక్టీస్​ టెస్ట్​లో ఆమెకు తక్కువ మార్కులు వచ్చాయి. ఇది ఆ 17ఏళ్ల బాలిక తండ్రి ధోందిరామ్​ భోన్స్​లేకి నచ్చలేదు.

ధోందిరామ్​ ఒక స్కూల్​ టీచర్​. తక్కువ మార్కులు వస్తే, నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని చెప్పాల్సింది పోయి.. కన్న కూతురిని దారుణంగా కొట్టాడు ఆ తండ్రి. కర్రతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. ఆ 12వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా గత శుక్రవారం ప్రాణాలు విడిచింది.

సాధ్న భోన్స్​లే తలకు గాయమవ్వడంతో మరణించిందని సాంగ్లీలోని ఉషాకల్​ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చికిత్స ప్రారంభించడానికి ముందే ఆమె మృతిచెందినట్టు వెల్లడించాయి.

తన భర్తపై ఆ కుతురి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

“బాలిక తల్లి నుంచి జూన్​ 22న మాకు ఫిర్యాదు వచ్చింది. నీట్​ మాక్​ టెస్ట్​లో తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో తన భర్త, కూతురిని దారుణంగా కొట్టినట్టు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది,” అని పోలీసులు చెప్పారు.

ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్​ చేశారు. కాగా, దర్యాప్తులో ఆ నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది.

దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో నీట్​ ఒకటి. యేటా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాస్తుంటారు. వీరిలో ఒత్తిడి స్థాయి అత్యధికంగా ఉంటుంది. ఆ ఒత్తిడి, తల్లిదండ్రులు అంచనాలు- ఆశలను తట్టుకోలేక ప్రతియేటా భారీ సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబం పిల్లలకు అండగా నిలబడాల్సిన సమయం ఇది. విఫలమైతే ఏమవ్వదు, విఫలమవ్వకపోతే సక్సెస్​ విలువ తెలియదు అని చెప్పాల్సింది పోయి.. మాక్​ టెస్ట్​లో తక్కువ మార్కులు వచ్చాయని కొట్టి చంపడం మానవజాతికే సిగ్గుచేటు!

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link