




Best Web Hosting Provider In India 2024

ప్రేమ విషయం తెలిసి మందలించడంతో ప్రియుడితో కలిసి తల్లిని చంపిన పదో తరగతి బాలిక
రోజురోజుకు మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి. చిన్న కారణాలకే తల్లిదండ్రులనే పిల్లలు చంపే పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా తెలంగాణలో ఘోరమైన ఘటన జరిగింది. తల్లిని పదో తరగతి బాలిక చంపేసింది.
ెలిసి తెలియని వయసులో వచ్చే ఆకర్శణతో అయిన వాళ్లనే చంపుకొంటున్నారు. ప్రేమ పేరుతో ఆవేశంలో కన్నవాళ్లనే కడతేరుస్తు్న్నారు. చిన్న వయసులో ప్రేమ పడటం తల్లిదండ్రులు అడ్డు చెబితే చావడమో.. చంపడమో చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ప్రేమ వ్యవహారంలో పదో తరగతి బాలికను తల్లి మందలించడంతో చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం..
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో అర్ధరాత్రి హత్య జరిగింది. అయితే పోలీసులు కేసు విచారణ చేస్తుండగా విస్తూపోయే విషయాలు తెలిశాయి. వివరాలు తెలిసి అందరూ షాక్ అయ్యారు. పదో తరగతి బాలికనే ఈ హత్యకు కారణమని తెలిసింది.
ఎన్ఎల్బీ నగర్లో సట్ల అంజలి(39) తన కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. బాలిక పదో తరగతి చదువుతోంది. శివ అనే 19 ఏళ్ల వ్యక్తితో బాలికకు పరిచయం ఉంది. ఆ తర్వాత ఇది ప్రేమగా మారింది. వీళ్లిద్దరూ ఎప్పుడూ కలుస్తూ ఉండేవారు. ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునేవారు.
ఈ విషయం తల్లి అంజలికి తెలిసి కుమార్తెను మందలించింది. ఈ వయసులో అలాంటి పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించింది. శివను కలవొద్దని, ప్రేమ వ్యవహారంలాంటి వాటి జొలికి వెళ్లకూడదని చెప్పింది. దీంతో ప్రియుడికి దూరమవుతానని బాలిక ఆలోచన చేసింది. తల్లి హత్యకు ప్లాన్ చేసింది.
ఎలాగైనా తల్లిని చంపేయాలనుకుంది బాలిక. ఈ విషయాన్ని ప్రియుడు శివతో కూడా మాట్లాడింది. ప్రియుడు శివతోపాటుగా అతడి సోదరుడు యశ్వంత్తో కలిసి తల్లిని చంపాలనుకుంది. సోమవారం అర్ధరాత్రి ప్రియుడితో కలిసి తల్లి అంజలిని గొంతు నులిమి, తలపై కొట్టి చంపేసింది. ఈ విషయం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ప్రేమ వ్యవహారంలో అడ్డు చెప్పడంతోనే తల్లి హత్యకు ప్లాన్ చేసినట్టుగా విచారణలో వెల్లడైంది.
టాపిక్