2029 అంతరిక్ష యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లు యువతి జాహ్నవి దంగేటి

Best Web Hosting Provider In India 2024

2029 అంతరిక్ష యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లు యువతి జాహ్నవి దంగేటి

Sudarshan V HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sudarshan V HT Telugu

2029 అంతరిక్ష యాత్రకు ఆంధ్రప్రదేశ్ యువతి జాహ్నవి దంగేటి ఎంపికయ్యారు. ప్రపంచ అంతరిక్ష యాత్రలకు భారత సంతతికి చెందిన ప్రజల నుండి పెరుగుతున్న సహకారానికి జాహ్నవి నిదర్శనంగా నిలిచింది. జాహ్నవి దంగేటి ఎవరు? ఆమె విద్యాభ్యాసం తదితర వివరాలను ఇక్కడ చూడండి.

జాహ్నవి దంగేటి

అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI) 2029 అంతరిక్ష యాత్రకు వ్యోమగామి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 23 ఏళ్ల అంతరిక్ష ఔత్సాహికురాలు జాహ్నవి దంగేటి ఎంపికయ్యారు. 2029 అంతరిక్ష యాత్రకు ఆమె ఎంపిక ప్రపంచ అంతరిక్ష యాత్రలకు భారత సంతతికి చెందిన ప్రజల నుండి పెరుగుతున్న సహకారానికి నిదర్శనం.

2026 నుంచి శిక్షణ

“మా కొత్త ఆస్కాన్ (వ్యోమగామి అభ్యర్థి) బృందంలో సభ్యురాలిగా జాహ్నవిని ఎంపిక చేసినట్లు మేము ధృవీకరించగలము” అని టిఎస్ఐ ధ్రువీకరించింది. 2026 నుంచి మూడేళ్ల పాటు ఆమె టైటాన్ స్పేస్ ఆస్కాన్ ప్రోగ్రామ్ ద్వారా ఇంటెన్సివ్ వ్యోమగామిగా శిక్షణ పొందుతారు. ఇందులో ఫ్లైట్ సిమ్యులేషన్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్స్, సర్వైవల్ ట్రైనింగ్, మెడికల్, సైకలాజికల్ ఎవల్యూషన్స్ ఉంటాయి. ఈ విషయాన్ని జాహ్నవి తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పేర్కొంది. టైటాన్స్ స్పేస్ ఆర్బిటాల్ ఫ్లైట్ ఐదు గంటల పాటు కొనసాగుతుందని, శాస్త్రీయ పరిశోధన, మానవ అంతరిక్షయానం పురోగతికి ప్రత్యేకమైన పరివర్తన వాతావరణాన్ని అందిస్తుందని జాహ్నవి తెలిపారు.

పాలకొల్లు యువతి

టైటాన్ స్పేస్ మిషన్ చీఫ్ ఆస్ట్రోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వ్యోమగామి కల్నల్ (రిటైర్డ్) విలియం మెక్ ఆర్థర్ జూనియర్ నేతృత్వంలో ఈ స్పేస్ మిషన్ జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామిగా ఎంపికై నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందినందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతిచోటా ఉన్న యువ భారతీయులకు ఆమె విజయం ఆశాదీపం, ఆశయం. త్వరలోనే ఆమె టైటాన్ ఆర్బిటాల్ పోర్టు స్పేస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. మనందరికీ గర్వకారణం’’ అని కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఎవరీ జాహ్నవి దంగేటి?

జాహ్నవి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ చేసేందుకు పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో చేరారు. ఆమె తల్లిదండ్రులు పద్మశ్రీ, శ్రీనివాస్ కువైట్ లో ఉంటున్నారు.

అనేక రివార్డులు, రికార్డులు

2022 లో, జాహ్నవి దక్షిణ పోలాండ్ లోని అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ క్రాకోవ్ నుండి అతి పిన్న వయస్కుడైన విదేశీ అనలాగ్ వ్యోమగామి, మొదటి భారతీయురాలుగా నిలిచారు. నాసా, ఇతర అంతర్జాతీయ సంస్థలు స్పాన్సర్ చేసిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కోలాబరేషన్ (IASC)లో పనిచేయడం జాహ్నవి సాధించిన శాస్త్రీయ విజయాల్లో ఒకటి. హవాయిలోని పాన్-స్టార్స్ టెలిస్కోప్ ద్వారా రియల్ టైమ్ ఆస్ట్రోనామికల్ డేటాను ఉపయోగించి గ్రహశకలాల ఆవిష్కరణ కార్యక్రమంపై ఆమె పనిచేశారు. నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ లో పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ వేడుకల్లో యంగ్ అచీవర్ అవార్డుతో సహా అనేక అవార్డులు ఆమెను వరించాయి.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

టాపిక్

IsroNasaJames Webb Space TelescopeInternational NewsAndhra Pradesh NewsNational NewsViral India World
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024