సొంత గడ్డపై తొలిసారి క్షిపణి పరీక్ష నిర్వహించిన జపాన్

Best Web Hosting Provider In India 2024


సొంత గడ్డపై తొలిసారి క్షిపణి పరీక్ష నిర్వహించిన జపాన్

Sudarshan V HT Telugu

జపాన్ తొలిసారి స్వంత భూభాగంపై క్షిపణి పరీక్షలు నిర్వహించింది. తన ఉత్తర ప్రధాన ద్వీపం హొక్కైడోలోని షిజునై యాంటీ-ఎయిర్ ఫైరింగ్ రేంజ్ వద్ద టైప్ -88 ఉపరితలం నుండి సముద్రంలోని ఓడ పైకి ప్రయోగించగల క్షిపణిని మంగళవారం పరీక్షించింది.

తొలిసారి క్షిపణి పరీక్ష నిర్వహించిన జపాన్ (AFP)

జపాన్ భూభాగంపై తొలిసారిగా క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు జపాన్ సైన్యం మంగళవారం ప్రకటించింది. టైప్-88 ఉపరితలం నుంచి నౌకకు షార్ట్ రేంజ్ క్షిపణిని జపాన్ ఉత్తర ప్రధాన ద్వీపం హొక్కైడోలోని షిజునై యాంటీ ఎయిర్ ఫైరింగ్ రేంజ్ లో మంగళవారం పరీక్షించారు.

భూమిపై నుంచి సముద్రంపైకి..

గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన మొదటి ఆర్టిలరీ బ్రిగేడ్ చేపట్టిన ఈ విన్యాసాల్లో సుమారు 300 మంది సైనికులు పాల్గొని హొక్కైడో దక్షిణ తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానవ రహిత పడవపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలను అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. చైనాకు దీటుగా స్ట్రైక్ బ్యాక్ సామర్థ్యాలను సొంతం చేసుకునేందుకు జపాన్ తన సైనిక నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షను నిర్వహించారు.

గతంలో యూఎస్, ఆస్ట్రేలియాల్లో..

ఈ ఏడాది చివరి నుంచి తోమహాక్స్ సహా దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోహరించాలని జపాన్ యోచిస్తోంది. జపాన్ గతంలో అమెరికా, ఆస్ట్రేలియా వంటి తన రక్షణ రంగ భాగస్వాముల భూభాగాలతో సహా పలు ఇతర విదేశాలలో క్షిపణి పరీక్షలు నిర్వహించింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link