




Best Web Hosting Provider In India 2024

బోనమెత్తనున్న భాగ్యనగరం – ఇవాళ్టి నుంచి ఆషాడ మాసం బోనాలు షురూ
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండగల్లో బోనాలు ఒకటి. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలు నేటి నుంచి షురూ కానున్నాయి. ఇవాళ గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ప్రారంభమవుతాయి. మరోవైపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ నగరంలో బోనాల పండగ సందడి మొదలైంది. ఆషాడ మాసం ప్రారంభమైన నేపథ్యంలో… బోనాల పండుగతో నగరానికి కొత్త శోభ సంతరించుకుంది. శ్రీ జగదాంబ మహంకాళి గోల్కొండ బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రాంరంభం కానున్నాయి. ఇక్కడ సమర్పించే మొదటి బోనంతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
ఇవాళ్టి నుంచి పలు తేదీలలో తొమ్మిది రోజుల పాటు బోనాల వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచి మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అమ్మవారికి బంగారు బోనం…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ఉన్న అమ్మవార్లకు భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇవాళ గోల్కొండలో మొదటి బోనం నుండి బోనాల సందడి ప్రారంభం అవుతుంది. పూజల ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి రోజు లంగర్హౌజ్ చౌరస్తా నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తారు చోటాబజార్లోని ఆలయం పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం, ఘట్టం ఊరేగింపు, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం ఊరేగింపు నిర్వహిస్తారు. ఇవన్నీ గోల్కొండ కోటపైకి చేరిన తర్వాత ఆలయం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, బోనం అమ్మవారిక సమర్పిస్తారు.
ఈనెల 29న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారికి రెండో బంగారు బోనం సమర్పిస్తారు. ఇక జూలై 2న బల్కంపేట అమ్మవారికి మూడో బంగారు బోనం సమర్పిస్తారు. జూలై 4 వ తేదీన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం, జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 5వ బంగారు బోనం సమర్పిస్తారు. జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పించనున్నారు.
ఇక జూలై 20న పాతబస్తీలో బోనాలు ఉంటాయి. జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. ఈసారి జరగబోయే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను ఇప్పటికే మంజూరు చేసింది.
టాపిక్