తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు – పెండింగ్ బిల్లులు విడుదల

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు – పెండింగ్ బిల్లులు విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను విడుదల చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఇటీవలనే డీఏ పెంపుపై ప్రకటన చేసిన ప్రభుత్వం…. తాజాగా పెండింగ్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వివరాలను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్‌లో ఉన్న రూ.180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిర్ణయంతో 26,519కి ఊరట దక్కనుందని వెల్లడించారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. “ లెక్కకు మించిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని క్లియర్ చేశాం” అని ప్రకటన చేశారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Telangana NewsTrending TelanganaMallu Bhatti VikramarkaGovernment Employees
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024