ఎస్ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2025.. దరఖాస్తుకు చివరి తేదీ నేడే!

Best Web Hosting Provider In India 2024


ఎస్ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2025.. దరఖాస్తుకు చివరి తేదీ నేడే!

Anand Sai HT Telugu

ఎస్ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 261 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు.

స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్

స్ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2025 ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ 26 జూన్ 2025న ముగియనుంది. మీరు ఇంకా దరఖాస్తు చేయకపోతే ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అప్లై చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం పొందే సువర్ణావకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 261 మందిని నియమించనున్నారు. చివరి తేదీ తర్వాత దరఖాస్తులను స్వీకరించరు.

అర్హతలు

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 + 2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్ డీ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిలో ఓబీసీ కేటగిరీకి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును రూ.100గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు లేదు.

ఎలా అప్లై చేయాలి?

దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి అధికారిక వెబ్‌సైట్‌ ssc.gov.in సందర్శించి అప్లై ఆన్‌లైన్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎస్ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ 2025 రిజిస్ట్రేషన్ లింక్‌కు చేరుకుంటారు. మొదటిసారి రిజిస్ట్రేషన్ కోసం సైన్ అప్ చేయండి లేదా రిజిస్టర్ చేసినప్పుడు లాగిన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు అర్హత, వయస్సు, చిరునామా, ఇతర సమాచారానికి సంబంధించిన వివరాలను నమోదు చేయండి. నింపిన అన్ని వివరాలను తనిఖీ చేసి ధృవీకరించండి. ఆపై ఫారాన్ని పూర్తి చేయడానికి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. తరువాతి దశలో మీ ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయండి. ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024


Source link