గద్వాల తేజేశ్వర్‌ హత్య కేసు : తల్లి, కుమార్తెతో బ్యాంక్ మేనేజర్ ఎఫైర్ – ఎంగేజ్‌ మెంట్‌ తర్వాతనే మర్డర్ స్కెచ్..!

Best Web Hosting Provider In India 2024

గద్వాల తేజేశ్వర్‌ హత్య కేసు : తల్లి, కుమార్తెతో బ్యాంక్ మేనేజర్ ఎఫైర్ – ఎంగేజ్‌ మెంట్‌ తర్వాతనే మర్డర్ స్కెచ్..!

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్‌ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. A1గా బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు, A2గా ఐశ్వర్యను పేర్కొన్నారు. కేసు వివరాలను గద్వాల జిల్లా ఎస్పీ వెల్లడించారు.

ఐశ్వర్య -తేజేశ్వర్‌ ఎంగేజ్‌ మెంట్‌ ఫొటో

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్‌ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.A1 తిరుమల రావు, A2 ఐశ్వర్య, A8 సుజాత (ఐశ్వర్య తల్లి) పేర్లను చేర్చారు. హత్యకు ఉపయోగించిన కారు, 2 ఎరుకలి కొడవళ్ళు, ఒక కత్తి, రూ.లక్ష 20 వేలు, 10 మొబైల్ ఫోన్లతో పాటు జీపీఎస్ ట్రాకర్ ను స్వాధీనం చేసుకున్నారు.

అప్పట్నుంచే మర్డర్ స్కెచ్ – జిల్లా ఎస్పీ

ఈ కేసుకు సంబంధించిన వివరాలను గద్వాల జిల్లా ఎస్పీ ఇవాళ వెల్లడించారు. బ్యాంకు మేనేజర్‌ తిరుమలరావుకు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితో సంబంధం ఉందని తెలిపారు. ఈ వివాహేతర సంబంధాలను ఇలాగే కొనసాగించాలని తిరుమలరావు అనుకున్నాడని చెప్పారు. ఎంగేజ్‌ మెంట్‌ అయినప్పటి నుంచి తేజేశ్వర్‌ను చంపేందుకు స్కేచ్‌ వేశారని వివరించారు.

తేజేశ్వర్‌ను చంపేస్తే ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని తిరుమలరావు భావించినట్లు ఎస్సీ తెలిపారు. తిరుమలరావు, ఐశ్వర్య.. ఎప్పుడూ వీడియోకాల్‌లో ఉండేవారన్నారు. చాలాసార్లు తేజేశ్వర్‌పై అటాక్‌ చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ ప్రయత్నించిందని చెప్పారు. పొలం సర్వే చేయాలని తేజేశ్వర్‌ను తీసుకొని వెళ్లారని… కారులో డ్రైవర్‌ పక్కన కూర్చున్న తేజేశ్వర్ ను హత్య చేశారని వెల్లడించారు. బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమలరావు, ఐశ్వర్యతో పాటు సుపారీ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

ఫిబ్రవరిలో పెళ్లి – ఆ తర్వాత ఏం జరిగిందంటే…?

జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ (32) జూన్ 17వ తేదీన హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో ఆయన భార్య, భార్య ప్రియుడికి భాగస్వామ్యం ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. ఆ దిశగా విచారణ కొనసాగించగా… సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. తేజేశ్వర్‌కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయమైంది. అయితే, పెళ్లికి ఐదు రోజుల ముందే ఐశ్వర్య కనిపించకుండా పోయింది.

కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, అతని దగ్గరికే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. “నువ్వంటే నాకు చాలా ఇష్టం” అంటూ ఏడ్చింది. దీంతో ఐశ్వర్య మాటలు నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.

తేజేశ్వర్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయిన రెండో రోజు నుంచే వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఐశ్వర్య భర్తను అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడూ ఫోన్‌లోనే మాట్లాడుతుండేది. భర్త మందలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ కనిపించకుండా పోవడంతో, అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గాలింపు చర్యల్లో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది. తేజేశ్వర్ కుటుంబసభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో… ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించారు. అప్పుడు కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్‌గా పని చేస్తుంది. అదే బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. తేజేశ్వర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఐశ్వర్య ఆ బ్యాంకు ఉద్యోగితో ఏకంగా 2,000 సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్‌ను అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతం అవుతుందని భావించి హత్యకు పథకం వేసినట్లు తుది విచారణలోనూ తేలింది. పక్కాగా ఆధారాలు సేకరించిన పోలీసులు… ప్రధాన నిందితులతో సహా సుఫారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ts PoliceTelangana NewsMahabubnagarKurnoolAndhra Pradesh NewsCrime News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024