అప్పు తీర్చలేక భార్యను స్నేహితుడికి అమ్మిన భర్త; ఆమెపై అత్యాచారం చేసిన ఆ ఫ్రెండ్

Best Web Hosting Provider In India 2024


అప్పు తీర్చలేక భార్యను స్నేహితుడికి అమ్మిన భర్త; ఆమెపై అత్యాచారం చేసిన ఆ ఫ్రెండ్

Sudarshan V HT Telugu

స్నేహితుడి వద్ద అప్పు చేసి, ఆ అప్పు తీర్చలేక, ఆ స్నేహితుడికి తన భార్యనే అమ్మేశాడో ప్రబుద్ధుడు. ఆ మహిళపై ఆ ఫ్రెండ్ అత్యాచారం చేశాడు. ఈ దారుణం మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.

భార్యను స్నేహితుడికి అమ్మిన భర్త (Pixabay/Representational image)

మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో రూ.50 వేల అప్పు తీర్చేందుకు ఓ వ్యక్తి తన భార్యను స్నేహితుడికి అమ్మేశాడు. ఆమెపై ఆ స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఇండోర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే, నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు దాన్ని ‘జీరో’ ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి తదుపరి చర్యల కోసం ధార్ పోలీసులకు పంపించారు. కాగ్నిజబుల్ నేరానికి సంబంధించి ఫిర్యాదు వచ్చినప్పుడు పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ అయినా ‘జీరో’ ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు.

రూ. 50 వేల కోసం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధార్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని కన్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత మహిళ భర్త నివసిస్తుండగా, అతని భార్య వేరుగా ఇండోర్ లో నివసిస్తోంది. తన భర్త జూదగాడని, ఆ అలవాటు కారణంగా అతని అప్పు పెరుగుతూ వచ్చిందని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయానని, తన స్నేహితుడి వద్ద రూ. 50 వేలు అప్పు చేశానని, ఆ అప్పు తీర్చడానికి తనకు అప్పు ఇచ్చిన స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని తన భర్త బలవంతం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఒకరోజు తన భర్త స్నేహితుడు తన ఇంటికి వచ్చి తనపై అత్యాచారం చేశాడని తెలిపింది.

పరారీలో నిందితులు

పరారీలో ఉన్న నిందితులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ధార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) గీతేశ్ కుమార్ గార్గ్ తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశామన్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link