మాటకైనా కోహ్లి, రోహిత్ పేరు చెప్పని నీరజ్ చోప్రా.. బెస్ట్ జావెలిన్ త్రో విసిరే క్రికెటర్ ఎవరంటే? ఆన్సర్ వైరల్

Best Web Hosting Provider In India 2024


మాటకైనా కోహ్లి, రోహిత్ పేరు చెప్పని నీరజ్ చోప్రా.. బెస్ట్ జావెలిన్ త్రో విసిరే క్రికెటర్ ఎవరంటే? ఆన్సర్ వైరల్

భారత జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో మరే భారత అథ్లెట్ కు సాధ్యం కాని ఘనతలు అతను అందుకున్నాడు. ఒలింపిక్స్ గోల్డ్ కూడా గెలిచాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జావెలిన్ త్రోయర్ విజయం సాధించగలిగే క్రికెటర్ ఎవరంటే నీరజ్ చెప్పిన ఆన్సర్ వైరల్ గా మారింది.

నీరజ్ చోప్రా (HT_PRINT)

జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు భారత సంచలనం నీరజ్ చోప్రా. జులై 5న బెంగళూరులో జరగనున్న ప్రారంభ ఎన్సీ క్లాసిక్‌ ఈవెంట్ లో అతను పాల్గొంటాడు. నీరజ్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. 90 మీటర్ల మార్కును కూడా అధిగమించాడు. రాబోయే ఎన్సీ క్లాసిక్‌కు ముందు.. స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నీరజ్‌ను మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఇంటర్వ్యూ చేశారు.

క్రికెటర్ ఎవరంటూ

ఈ ఇంటర్వ్యూలో జావెలిన్ త్రోలో పరుగు వేగం చాలా ముఖ్యమైనదని వెల్లడించిన సిద్ధు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. జావెలిన్ త్రోయర్‌గా విజయం సాధించగల ఇండియన్ క్రికెటర్ పేరు చెప్పమని నీరజ్ చోప్రా ను సిద్ధు అడిగాడు. టోక్యో ఒలింపిక్స్ 2020 లో గోల్డ్ గెలిచిన నీరజ్ చోప్రా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి వారిని తిరస్కరించి జస్ప్రీత్ బుమ్రాను ఎంచుకున్నాడు.

“ఇది ఫాస్ట్ బౌలర్ మాత్రమే అని నేను భావిస్తున్నా. జస్ప్రీత్ బుమ్రా తన ఉన్నత స్థితిలో, సరైన ఫిట్‌నెస్‌తో, జావెలిన్ త్రోను విసరడాన్ని నేను చూడాలనుకుంటున్నా” అని నీరజ్ చెప్పాడు.

ఈ ఏడాది అదుర్స్

నీరజ్ చోప్రా తన 2025 సీజన్ ను పోచెఫ్‌స్ట్రూమ్‌లో జరిగిన ఆహ్వాన పోటీతో ప్రారంభించాడు. అతను 84.52 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించాడు. మంచి ఫామ్‌ను ప్రదర్శించాడు. తరువాత దోహాలో జరిగిన డైమండ్ లీగ్‌లో అతను రెండో స్థానంలో నిలిచాడు. ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న 90 మీటర్ల మార్కును అందుకున్నాడు. కానీ రజతంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. తరువాత చోర్జోలోని జానుజ్ కుసోసిన్స్కి మెమోరియల్‌లో అతను 84.14 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో నిలిచాడు.

భారత్, పాక్

నీరజ్ చివరగా పారిస్ డైమండ్ లీగ్‌లో 88.16 మీటర్ల ఓపెనింగ్ త్రోతో జూలియన్ వెబర్‌ను ఓడించాడు. ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్‌లో 88.16 త్రోతో అతను సీజన్‌లో తన మూడవ విజయాన్ని కూడా పొందాడు. రాబోయే ఎన్సీ క్లాసిక్ ఈవెంట్ కు అర్షద్ నదీమ్ (పాకిస్థాన్), వెబర్ (జర్మనీ) అటెండ్ కావడం లేదు. ఇండో-పాక్ ఉద్రిక్తతల కారణంగా అర్షద్ నదీమ్, వెబర్ బహిరంగంగా నీరజ్ ఆహ్వానాన్ని తిరస్కరించారు.

దీంతో బెంగళూరులో జరిగే ఎన్సీ క్లాసిక్ ఈవెంట్లో నీరజ్ ప్రధాన ప్రత్యర్థి గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ కానున్నాడు. అతను ప్రస్తుత ప్రపంచ నంబర్ 3. గత సంవత్సరం సెప్టెంబర్ 17న బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌ను గెలుచుకున్నప్పుడు పీటర్స్.. నీరజ్ నుంచి నంబర్ 1 స్థానాన్ని లాక్కున్నాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link