నెలకు రూ. 29,200 ప్రారంభ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు- ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​ షురూ..

Best Web Hosting Provider In India 2024


నెలకు రూ. 29,200 ప్రారంభ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు- ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​ షురూ..

Sharath Chitturi HT Telugu

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్​! ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​ 2025 ప్రారంభమైంది. ఈసారి 6200కుపైగా ఖాళీలకు రిక్రూట్​మెంట్​ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​ షురూ.. (Official website, screenshot)

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్​ఆర్బీ) 2025 సంవత్సరానికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్, వివిధ కేటగిరీల టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ఇటీవలే ప్రారంభించాయి. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు rrbapply.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆర్​ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025కి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్​ లింక్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్​ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025..

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 6238 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్​ఆర్బీల వారీగా ఖాళీల వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు. నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​ 2025 అప్లికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 28తో ముగుస్తుంది.
  • అప్లికేషన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ జులై 30.
  • అప్లికేషన్ ఫారమ్ సవరణ విండో ఆగస్టు 1న తెరుచుకొని, ఆగస్టు 10న క్లోజ్​ అవుతుంది.

వయో పరిమితి (జులై 1, 2025 నాటికి):

  • టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టుకు అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు నిండి, 33 సంవత్సరాలకు మించకూడదు.
  • టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టుకు అభ్యర్థులు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • నియమ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​ 2025- జీతాలు..

పోస్టు పేరుపే లెవల్​ప్రారంభ వేతనంమొత్తం వేకెన్సీలు
టెక్నీషియన్​ గ్రేడ్​ 1 సిగ్నల్​లెవల్​ 5రూ. 29,200183
టెక్నీషియన్​ గ్రేడ్​ 3లెవల్​ 2రూ. 19,9006055

దరఖాస్తు రుసుము:

ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​ 2025కి అప్లై చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులు మినహా మిగిలిన వారికి దరఖాస్తు రుసుము రూ. 500. వీరు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)కి హాజరైతే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి రూ. 400 తిరిగి ఇస్తారు.

ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250. వీరు సీబీటీకి హాజరైతే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి ఈ రుసుము పూర్తిగా తిరిగి ఇవ్వడం జరుగుతుంది.

ఎంపిక ప్రక్రియ:

ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​ 2025 ఎంపిక ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. రెండు పోస్టులకు (టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-III) సీబీటీ విడివిడిగా నిర్వహిస్తారు.

సీబీటీ పరీక్ష విధానం:

  • పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
  • మొత్తం 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
  • ప్రతి తప్పు సమాధానానికి ⅓ మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

తదుపరి ఎంపిక ప్రక్రియకు అర్హత సాధించడానికి కనీస మార్కులు:

అన్‌రిజర్వ్‌డ్: 40 శాతం

ఈడబ్ల్యూఎస్: 40 శాతం

ఓబీసీ-ఎన్‌సీఎల్: 30 శాతం

ఎస్సీ: 30 శాతం

ఎస్టీ: 25 శాతం

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆయా ఆర్​ఆర్బీల అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link