రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 8 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్‌ సిద్ధం!

Best Web Hosting Provider In India 2024


రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 8 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్‌ సిద్ధం!

Anand Sai HT Telugu

మీరు రైలులో ఎక్కువగా ప్రయాణించేవారైతే మీకోసం గుడ్‌న్యూస్ ఉంది. రిజర్వేషన్ ప్రక్రియను పునరుద్ధరించడానికి భారతీయ రైల్వే సన్నద్ధమవుతోంది.

భారతీయ రైల్వే

రైలు ఛార్టుల తయారీ ప్రక్రియలో కీలక మార్పు రానుంది. నూతన పద్ధతిని తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే ప్రధాన చర్యలో భాగంగా భారతీయ రైల్వే 8 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ చర్యతో ఉపశమనం లభిస్తుంది.

8 గంటల ముందు చార్ట్

కొత్త విధానం రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు ప్యాసింజర్ చార్ట్‌ను కన్ఫామ్ చేస్తుంది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు మెరుగైన అంచనాలను అందించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నారు. భారతీయ రైల్వే తన టికెటింగ్, రిజర్వేషన్ ప్రక్రియను పునరుద్ధరించడానికి సిద్ధమవుతోంది. ఇందులో రైలు ఛార్టుల తయారీతో పాటు ఇతర చర్యలు ఉన్నాయి.

పీఆర్ఎస్

2025 డిసెంబర్ నాటికి రైల్వే మోడ్రన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)ను ప్రవేశపెడుతుందని సమాచారం. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(సీఆర్ఐఎస్) ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. కొత్త పీఆర్ఎస్ అమల్లోకి వస్తే నిమిషానికి 1.5 లక్షల టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం నిమిషానికి 32,000 టికెట్ల సామర్థ్యం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. టికెట్ ఎంక్వైరీ వ్యవస్థను అప్ గ్రేడ్ చేస్తామని, ఎంక్వైరీ కెపాసిటీ నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలకు పెరుగుతుందని, లక్షలాది మంది ప్రయాణికులకు రియల్ టైమ్ బుకింగ్ సమాచారం అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ఛార్జీల పెంపు

జులై నుంచి 500 కిలోమీటర్లు దాటిన సెకండ్ క్లాస్ ప్రయాణ ఛార్జీలను కిలోమీటరుకు అర పైస చొప్పున పెంచనున్నట్లు భారతీయ రైల్వే ఇటీవల ప్రకటించింది. 2020 తర్వాత ఛార్జీలు పెంచడం ఇదే తొలిసారి. మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కిలోమీటరుకు 1 పైస, ఏసీ క్లాస్ రైళ్లకు కిలోమీటర్‌కు 2 పైసలు పెంచనున్నారు. అయితే సబర్బన్ ఛార్జీలు, నెలవారీ సీజన్ టికెట్లలో ఎలాంటి మార్పు ఉండదు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link