



Best Web Hosting Provider In India 2024
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర మరో 24 గంటలు వాయిదా
ఇప్పటికే చార్ధామ్ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్కు చేరుకున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ వాతావరణం మారుతోంది. దీని కారణంగా చార్ధామ్ యాత్రను రాబోయే 24 గంటలు వాయిదా వేశారు.
త్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రను మరో 24 గంటలు వాయిదా వేశారు. గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే చార్ధామ్ యాత్రపై మాట్లాడారు. భారీ వర్షాల హెచ్చరిక దృష్ట్యా చార్ధామ్ యాత్రను రాబోయే 24 గంటలు వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. దీనితో పాటు హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, వికాస్నగర్లలో యాత్రికులను ఆపాలని పోలీసులు, పరిపాలన అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.
యాత్రను రాబోయే 24 గంటల పాటు వాయిదా వేస్తున్నట్టు, పోలీసులు, పరిపాలన అధికారులకు కొన్ని సూచనలు కూడా ఇచ్చామని శంకర్ పాండే అన్నారు. ఈ సమయంలో హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, వికాస్నగర్లలో యాత్రికుల రాకపోకలను నిలిపివేస్తారు. తదుపరి ఉత్తర్వు వచ్చే వరకు ఈ యాత్ర వాయిదా పడుతుంది.
ఉత్తరకాశి జిల్లాలోని బార్కోట్-యమునోత్రి రోడ్డులోని సిలై బ్యాండ్లో క్లౌడ్ బరస్ట్ అయింది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న హోటల్ స్థలంలో నివసిస్తున్న తొమ్మిది మంది కార్మికులు గల్లంతు అయ్యారు. సమాచారం ప్రకారం మొత్తం 19 మంది కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు. ఇప్పటివరకు 10 మంది కార్మికులను సురక్షితంగా రక్షించగా, 9 మంది కార్మికులు ఇంకా కనిపించడం లేదు.
ఈ ఆపరేషన్లో ఎస్డీఆర్ఎఫ్, ఉత్తరాఖండ్ పోలీసులు, స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ శాఖ, ఎన్హెచ్ బార్కోట్, ఆరోగ్య శాఖల సంయుక్త బృందాలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రజా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ యాత్రికులను సురక్షిత ప్రదేశాలలో నిలిపివేసింది ప్రభుత్వం.
మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. ‘ఉత్తరకాశి జిల్లాలోని బార్కోట్ తహసీల్లోని సిలై బ్యాండ్ ప్రాంతంలో కొంతమంది కార్మికులు గల్లంతైనట్లు సమాచారం. బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నాను.’ అని ఆయన అన్నారు.
Best Web Hosting Provider In India 2024
Source link