





Best Web Hosting Provider In India 2024

ఈ నగరానికి ఏమైంది మూవీ సీక్వెల్ వచ్చేస్తుందోచ్.. టైటిల్ రివీల్.. మోషన్ పోస్టర్ రిలీజ్.. వీడియో వైరల్
యూత్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ సినిమాలో కామెడీ, ఫ్రెండ్ షిప్ గోల్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పటికీ ఈ సినిమా క్లిప్స్, మీమ్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడీ సినిమా సీక్వెల్ కు టైమ్ ఆసన్నమైంది. పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి టాలీవుడ్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెటర్ గా నిలిచిన మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’. 2018లో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే అల్లరి, హంగామా వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ను పంచింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో థియేటర్లకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా రూ.12 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
సీక్వెల్ రెడీ
ఈ నగరానికి ఏమైంది సినిమా 2018లో రిలీజైంది. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికీ ఫ్యాన్స్ నోళ్లలో నానుతూనే ఉంది. ఈ మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ నగరానికి ఏమైంది మూవీ సీక్వెల్ ను రెడీ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
టైటిల్ ఇదే
ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్ పెట్టినప్పుడే ఫ్యాన్స్ లో ఉత్కంఠ మొదలైంది. ఆ టైటిల్ తో మూవీ సక్సెస్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 కూడా అదే టైటిల్ ను కొనసాగిస్తూ కాస్త వెరైటీగా ప్రజెంట్ చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది రిపీట్ అనే టైటిల్ ను పట్టారు. అయితే ఈ నగరానికి ఏమైంది.. అనే అర్థం వచ్చేలా తెలుగులో ‘ఈ’ అక్షరం, మధ్యలో ఇంగ్లిష్ లెటర్ ‘ఎన్’, చివర్లో ‘ఈ’ అక్షరం రివర్స్ లో పెట్టారు.
మ్యాడ్ నెస్ రిపీట్
ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్, వీడియోను సురేష్ ప్రొడక్షన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘‘గతంలో వాళ్లు ట్రిప్ ప్లాన్ చేశారు. అది కల్ట్ గా మారింది. ఇప్పుడు మ్యాడ్ నెస్ ను రిపీట్ చేసేందుకు, మీ రొటీన్ ను మార్చేందుకు వచ్చేస్తున్నారు. ఈఎన్ఈ రిపీట్ హ్యాంగ్ ఓవర్ ఇప్పటి నుంచే. ప్రి ప్రొడక్షన్ వర్క్ బిగిన్స్’’ అని పోస్టు చేశారు.
ఆ యాక్టర్స్
తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాలో విష్వక్ సేన్, సాయి సుమంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఫ్రెండ్స్ గ్యాంగ్ గా నటించారు. ఇప్పుడు సీక్వెల్ లోనే ఆ నలుగురు కలిసి మరోసారి ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో మూవీ గోవాలో సాగింది. ఇప్పుడు కథ అమెరికాకు చేరినట్లు తెలుస్తోంది.