





Best Web Hosting Provider In India 2024

కన్నప్ప తర్వాత మంచు విష్ణు చేసే సినిమా ఈ జానర్లోనే! దర్శకుడు ఎవరంటే..
కన్నప్ప తర్వాత తదుపరి చిత్రానికి మంచు విష్ణు రెడీ అవుతున్నారు. ఈ మూవీకి దర్శకుడు ఎవరో సమాచారం బయటికి వచ్చింది. ఏ జానర్లో మూవీ చేయనున్నారో కూడా తెలిసింది. ఆ వివరాలు ఇవే.
మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన కన్నప్ప సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ శుక్రవారం (జూన్ 27) థియేటర్లలో ఈ మైథలాజికల్ మూవీ విడుదలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమాకు వసూళ్లు బాగా వస్తున్నాయి. ఈ మూవీలో విష్ణు నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ తరుణంలో తన తదుపరి చిత్రానికి విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ప్రభుదేవా దర్శకత్వంలో..
డెవోషనల్ మూవీ కన్నప్ప తర్వాత మంచు విష్ణు ఏ చిత్రం చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు తదుపరి సినిమా చేయనున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్న ప్రభుదేవా ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయనతో నెక్ట్స్ చిత్రం చేసేందుకు విష్ణు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. విష్ణు – ప్రభుదేవా కాంబోలో ఈ చిత్రం కమర్షియల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్లో ఉంటుందని సమాచారం.
ప్రభుదేవాతో చేసే చిత్రంలో మంచు విష్ణు పాత్ర ఎనర్జిటిక్గా ఉండేలా ప్లాన్ చేశారట. ప్రభుదేవా స్టైల్ డైనమిక్ స్టోరీలైన్తో ఈ సినిమా ఉంటుందని టాక్. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు ఫ్యామిలీనే నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కన్నప్ప కలెక్షన్లు
కాగా, థియేటర్లలో కన్నప్ప జోరు చూపిస్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.40కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకున్నట్టు అంచనా. మూడో రోజైన ఆదివారం కూడా వసూళ్లు బాగానే నమోదవుతున్నాయి. బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఇది అర్థమవుతోంది. అయితే, సోమవారం నుంచే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అసలు పరీక్ష మొదలుకానుంది. సోమవారం కూడా జోరు చూపిస్తే బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగే ఛాన్స్ ఉంటుంది. మరి మండే టెస్టును ఈ చిత్రం పాస్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది.
విష్ణుకు ప్రశంసలు
కన్నప్ప చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శివుడి భక్తుడు కన్నప్ప పాత్రలో తన నటనతో విష్ణు మెప్పించారు. ప్రశంసలు పొందుతున్నారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్.. రుద్ర అనే కీలకపాత్ర పోషించారు. ఈ క్యారెక్టర్ చిత్రానికి హైలైట్గా నిలిచింది. మోహన్ లాల్ క్యామియో రోల్ చేశారు. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ నటించారు. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, ముకేశ్ రిషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవాసీ సంగీతం అందించారు. ఈ మూవీని మంచు మోహన్ బాబు నిర్మించారు.
సంబంధిత కథనం