





Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జూన్ 30 ఎపిసోడ్: జగదీశ్వరికి బదులు ఆఫీస్కు శాలిని- చంద్రకళపై అరుపులు- కొత్తగా తల్లీకూతుళ్ల చీరల బిజినెస్!
నిన్ను కోరి సీరియల్ జూన్ 30 ఎపిసోడ్లో తల్లీకూతుళ్లు కామాక్షి, శ్రుతిలు కొత్తగా చీరల బిజినెస్ పెడతారు. ఇదంతా అవసరమా అని శాలిని అంటుంది. జగదీశ్వరికి జ్వరం వస్తుంది. దాంతో తనకు బదులుగా ఆఫీస్ మీటింగ్కు శాలినిని వెళ్లమంటుంది. చంద్రకళను బయటకు వెళ్లమని అత్త చెప్పడంతో శాలిని అరుస్తుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చంద్రకళ దగ్గరికి విరాట్ వచ్చి చూశావు కదా వాళ్లు నేరం చేశారని శ్యామల అత్తకు తెలిసిన వెంటనే ఎలా రెచ్చిపోయిందో. ఒకవేళ నువ్వు సుభద్ర కూతురు అని తెలిస్తే నిన్ను ఏం చేస్తుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. అప్పుడు నేను నిన్ను అవాయిడ్ చేయడం కాదు శ్యామల అత్తే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తుంది. తన కోపం నీకు శాపంగా మారుతుంది అని విరాట్ అంటాడు.
చీరల బిజినెస్
దాంతో చంద్రకళ బాధపడుతుంది. పిన్ని గారికి నిజం తెలిస్తే నిజంగానే బయటకు పంపించిస్తారేమో అని భయపడుతుంది. మరోవైపు శృతి, కామాక్షి ఇద్దరు కొన్ని చీరలు తీసుకొచ్చి సర్దుతూ ఉంటే అక్కడికి శ్యామల వస్తుంది. ఏంటి ఇన్ని చీరలు తీసుకొచ్చారు. ఎందుకు అని అడుగుతుంది. మేము కొత్తగా ఇప్పుడు చీరలు బిజినెస్ పెట్టాము అని తల్లీకూతుళ్లు చెబుతారు.
ఇదివరకే పచ్చళ్ల బిజినెస్ పెట్టి దెబ్బతిని పచ్చడై ఉన్నారు. ఇప్పుడు ఇది మీకు అవసరమా అని శ్యామల సెటైర్లు వేస్తుంది. తర్వాత అక్కడికి శాలిని కూడా వస్తుంది. మీకు ఈ బిజినెస్లు, ఇదంతా అవసరమా అని శాలిని అంటుంది. నీకేంటమ్మా నువ్వేమో ఇంటి కోడలివి. ఏం చేసినా చేయకున్నా నడుస్తుంది. కానీ, మాకు అలా కాదు కదా. మమ్మల్ని తేరగా తింటున్నామని అంటున్నారు. అందుకే ఏదోటి చేయాలిగా అని కామాక్షి అంటుంది.
అరిచిన శాలిని
సరే మీకు నచ్చింది ఏదోటి చేసుకోండి అని చెప్పేసి వెళ్లిపోతుంది శాలిని. ఈ బిజినెస్తో మనం ఏంటో వీళ్లకు చూపించాలి అని శ్రుతితో కామాక్షి అంటుంది. మరోవైపు జగదీశ్వరికి చంద్రకళ పాలు ఇవ్వడానికి వెళ్తుంది. అక్కడికి శాలిని కూడా వస్తుంది. చంద్రకళని బయటికి వెళ్లమని చెప్పు శాలినితో జగదీశ్వరి అంటుంది. దాంతో చంద్రకళను బయటకు వెళ్లమని గట్టిగా అరుస్తుంది శాలిని.
అప్పుడే అక్కడికి విరాట్ వస్తాడు. అమ్మ రేపు మీటింగ్కి నువ్వు హాజరు అవ్వాలి అని చెప్తాడు. దానికి జగదీశ్వరి కూడా అంగీకరిస్తుంది. వెళ్తానని చెప్తుంది. ఇక మరుసటి రోజు తెల్లవారుజామున జగదీశ్వరి నిద్రలేవదు. అక్కడికి చంద్రకళ వచ్చి చూస్తే జగదీశ్వరికి జ్వరంగా ఉందని తెలుస్తుంది. దాంతో అందరూ వస్తారు. జగదీశ్వరికి ట్యాబ్లెట్స్ ఇస్తారు.
ఆఫీస్కు శాలిని
అయితే, ఆఫీస్ మీటింగ్కు నేను రాలేను కాబట్టి శాలిని నువ్వు వెళ్లు అని జగదీశ్వరి అంటుంది. దాంతో చంద్రకళ బాధపడుతుంది. శాలిని సంతోషంగా ఆఫీస్ మీటింగ్కు వెళ్తానని చెబుతుంది. అత్త జగదీశ్వరికి బదులు శాలిని ఆఫీస్ మీటింగ్కు వెళ్తుంది. తర్వాత ఇంటికి ఇద్దరు ఆడవాళ్లు వస్తారు. కామాక్షి గారి ఇల్లు ఇక్కడేనా అంటే అవును అని చెప్తారు. మేము చీరలు కొనడానికి వచ్చాము అని అంటారు.
అప్పుడు కామాక్షి, శృతి ఇద్దరు అందరు ముందు బిల్డప్ కొడుతూ చూశారా మా చీరలు కొనడానికి ఇంటికి జనాలు ఎలా వస్తున్నారో అనేసి వాళ్లిద్దరిని తీసుకెళ్లి వాళ్లకి నచ్చిన చీరలు చూపిస్తారు. వాళ్లు కూడా చాలా బాగున్నాయంటూ చీరలు కొని తీసుకుని వెళ్లిపోతారు.
పొంగిపోయిన తల్లీకూతుళ్లు
అదంతా చూసిన అందరూ ఇప్పుడైతే చీరలు కొన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని అనుకుంటారు. కానీ, కామాక్షి శృతి ఇద్దరు మాత్రం తమ బిజినెస్ బాగా నడుస్తోందని చాలా ఆనందంతో ఉప్పొంగి పోతారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్