సంగారెడ్డిలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి

Best Web Hosting Provider In India 2024

సంగారెడ్డిలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి

HT Telugu Desk HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఈరోజు (జూన్ 30, 2025) రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఈరోజు (జూన్ 30, 2025) రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఐదుగురు దుర్ఘటన స్థలంలో చనిపోయారని, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి సమీపంలోని ఇస్నాపూర్, చందానగర్ ఆసుపత్రుల్లో అందిస్తున్నారు.

ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని కొన్ని భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మంటలు పక్కనున్న ప్రాంతాలకు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. మృతుల సంఖ్య, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పేలుడుకు గల కారణాలు కూడా ఇంకా వెల్లడి కాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేక రసాయనాల లీకేజీ వల్ల జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

ఈ ఘటనతో పాశమైలారం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు విషాదకరం

‘సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చనిపోయినట్టు వస్తోన్న వార్తలు కలచి వేశాయి. రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలి. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి.’ అని ఎమ్మెల్సీ కవిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి

‘సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగి కార్మికులు అందులో చిక్కుకోవడం అత్యంత విషాదకరం. కార్మికులు, సిబ్బందిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’ అని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

టాపిక్

Breaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024