ఓటీటీలోకి నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ సిరీస్‍లో వాణి కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. డిటెక్టివ్‍గా నటించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది.

మండాలా మర్డర్స్: ఓటీటీలోకి నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ జానర్లో సిరీస్‍లు వస్తూనే ఉంటాయి. సస్పెన్స్, ట్విస్టులు, ఉత్కంఠతో ఉండటంతో ఇలాంటి సిరీస్‍లకు ఎక్కువ ఆదరణ దక్కుతుంటుంది. ఈ క్రమంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ‘మండాలా మర్డర్స్’ అనే నయా వెబ్ సిరీస్ వస్తోంది. బాలీవుడ్ స్టార్ నటి వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్తా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది. ఓ పోస్టర్ వచ్చేసింది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్ జూలై 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్నిఆ ప్లాట్‍ఫామ్ నేడు (జూన్ 30) అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది నెట్‍ఫ్లిక్స్. ఈ పోస్టర్లో వాణి కపూర్ గన్ పట్టుకొని ఉన్నారు. వైభవ్, శ్రీయా పింయోన్కర్, సువేన్ చావ్లా కూడా పోస్టర్లో ఉన్నారు.

మరణాల మిస్టరీ చుట్టూ..

మండాలా మర్డర్స్ సిరీస్‍‌కు గోపీ పుత్రన్ క్రియేటర్‌గా ఉన్నారు. చరణ్‍‌దాస్ పూర్ అనే ఊర్లో వరుసగా సంభవించే మరణాల వెనుక మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ కేసులను దర్యాప్తు చేసే డిటెక్టివ్‌ల పాత్రలను వాణి కపూర్, వైభవ్ రాజ్ చేశారు. సువీన్ చావ్లా ఈ సిరీస్‍‌లో నెగెటివ్ రోల్‍‌లో నటిస్తున్నారు. హత్యల వెనుక ఉన్న రహస్యాలు, మూఢ నమ్మకాలు, కుట్రలతో ఈ స్టోరీ ఉంటుందని అర్థమవుతోంది. సూపర్ నేచురల్, హారర్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నాయి.

మండాలా మర్డర్స్ సిరీస్‍‌ను యశ్ రాజ్ ఫిల్మ్ ఎంటర్‌టైన్‌‍మెంట్స్ పతాకంపై ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధానీ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. సందీప్ యాదవ్.. సినిమాటోగ్రఫీ చేశారు.

నెట్‌‍ఫ్లిక్స్‌లో అదరగొడుతున్న రైడ్ 2

కాగా, గత వారం జూన్ 26వ తేదీన నెట్‌‍ఫ్లిక్స్ ఓటీటీలో రైడ్ 2 చిత్రం స్ట్రీమింగ్‍‍‌కు వచ్చింది. ప్రస్తుతం ఆ ఓటీటీలో ఈ చిత్రం అదరగొడుతోంది. ఇండియాలో టాప్‍‌లో ఈ మూవీ ట్రెండ్ అవుతోంది. అజయ్ దేవ్‍‌గణ్ హీరోగా నటించిన రైడ్ 2 మూవీ మే 1వ తేదీన థియేటర్లలో విడుదలై సుమారు రూ.230కోట్ల కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు నెట్‍‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ మూవీకి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024