జులై 1 నుంచి అమల్లోకి కొత్త రైల్వే టికెట్ ఛార్జీలు.. పెంపు ఎలా ఉండనుంది?

Best Web Hosting Provider In India 2024


జులై 1 నుంచి అమల్లోకి కొత్త రైల్వే టికెట్ ఛార్జీలు.. పెంపు ఎలా ఉండనుంది?

Anand Sai HT Telugu

కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్‌ బుకింగ్‌కు సంబంధించి రైల్వే శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అర్ధరాత్రి నుంచి అంటే.. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

కొత్త రైల్వే టికెట్ ఛార్జీలు

భారతీయ రైల్వే జులై 1 నుండి కొన్ని రైళ్ల ఛార్జీలను పెంచింది. కొత్త ఛార్జీలు, టికెట్ బుకింగ్‌లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో ఆధార్ తప్పనిసరి చేసింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని అన్ని జోన్‌ల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అర్ధరాత్రి అంటే జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి.

జులై నుండి నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల ధరలు కిలోమీటరుకు 1 పైసా పెరిగాయి. ఏసీ-క్లాస్ ప్రయాణికులకు టికెట్ ధరలు కిలోమీటరుకు 2 పైసలు పెరుగుతాయని నోటిఫికేషన్ పేర్కొంది. అయితే కొత్త ఛార్జీలు సబర్బన్ టిక్కెట్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు.

సెకండ్ క్లాస్ ఆర్డీనరికి 500 కి.మీ. దాటితే అంటే 501 కి.మీ నుండి 1,500 కి.మీ దూరానికి టికెట్ ధర రూ.5, 1,501 కి.మీ నుండి 2,500 కి.మీ దూరానికి రూ.10 పెరుగుతుంది. 2,501 నుండి 3,000 కి.మీ దూరానికి ధర రూ.15 పెంచుతారు. సాధారణ నాన్-ఎసి రైళ్లకు, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్‌కు నాన్-సబర్బన్ రైళ్లకు ధర కిలోమీటరుకు అర పైస చొప్పున పెరుగుతుంది.

అంతేకాదు అన్ని రకాల రైళ్లలో ఏసీ అన్ని తరగతులకు కిలోమీటరుకు 2పైసలు చొప్పున పెంచుతున్నట్టుగా రైల్వే శాఖ తెలిపింది. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్‌ఛార్జీల్లో మార్పు ఉండదని తెలిపింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు అమలు కావని పేర్కొంది.

భారతీయ రైల్వేలు జులై 1 నుండి తత్కాల్ రైలు బుకింగ్‌లకు ఆధార్ తప్పనిసరి అని ప్రకటించింది. ఈ చర్య సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది. తత్కాల్ బుకింగ్‌ల కోసం ప్రయాణికులు ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణను ఉపయోగించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link