





Best Web Hosting Provider In India 2024

అల్లు అర్జున్, రామ్ చరణ్ కంటే అతడే బాగుంటాడు.. మోస్ట్ హ్యాండ్సమ్ హీరో: కాజల్ మెచ్చిన సౌత్ హీరో ఇతడే
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మెచ్చిన సౌత్ హీరో ఎవరో తెలుసా? అల్లు అర్జున్, రామ్ చరణ్ కంటే కూడా ఆమె మరో హీరోని బాగా ఇష్టపడుతోంది. ఆరు అడుగుల కంటే ఎక్కువే ఉండే ఆ హీరో ఆమె ఇచ్చిన రేటింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
కన్నప్ప మూవీలో పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ కనిపించిన తీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర రాణిస్తుండగానే.. గతంలో కాజల్ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలువురు సౌత్ స్టార్ హీరోల ‘లుక్స్’ గురించి రేటింగ్ ఇచ్చింది. ఆమె దృష్టిలో అందరిలోకెల్లా ‘మోస్ట్ హ్యాండ్సమ్’ ఎవరో తెలుసా?
సౌత్ హీరోల లుక్స్పై కాజల్ రేటింగ్స్
రాపిడ్-ఫైర్ రౌండ్లో, కాజల్ను సౌత్ నటులను వారి లుక్స్ ఆధారంగా రేట్ చేయమని అడిగారు. అప్పుడు ఆమె అల్లు అర్జున్కు 6/10, ప్రభాస్కు 8/10, రామ్ చరణ్కు 7/10, జూనియర్ ఎన్టీఆర్కు 6/10, కల్యాణ్ రామ్కు 5/10, రామ్ పోతినేనికి 7/10 రేటింగ్ ఇచ్చింది. ఈ జాబితాలో ప్రభాస్ను అందరిలోకెల్లా అత్యంత అందమైన హీరోగా ఆమె స్పష్టంగా చెప్పింది.
ఆమె ఇచ్చిన రేటింగ్లతో అభిమానులు కూడా అంగీకరించినట్లు కనిపిస్తోంది. ఆమె చాలా నిజాయతీగా ఈ రేటింగ్స్ ఇచ్చినట్లు వాళ్లు భావిస్తున్నారు. నిజానికి ఇలాంటి రాపిడ్ ఫైర్ రౌండ్స్లో చాలామంది తటపటాయిస్తారు. కానీ కాజల్ మాత్రం నిర్మొహమాటంగా చెప్పడం విశేషం.
ఈ హీరోలతో కాజల్ సినీ ప్రయాణం
కాజల్ ఈ నటులందరితో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఆమె అల్లు అర్జున్తో కలిసి విజయవంతమైన ‘ఆర్య 2’ చిత్రంలో నటించింది. రామ్ చరణ్తో ‘మగధీర’, ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘నాయక్’ వంటి పలు సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకుంది.
జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ‘బృందావనం’లో నటించింది. ఇక కల్యాణ్ రామ్తో ‘నాంది’ (2018లో విడుదలైన MLA), ‘లక్ష్మీ కళ్యాణం’ (2007) మూవీలలో, అలాగే 2009లో వచ్చిన ‘గణేష్’ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటించింది.
కాజల్ అగర్వాల్ రాబోయే సినిమాలు
కాజల్ తన నటనా ప్రస్థానాన్ని 2004లో ప్రారంభించి, ఇప్పుడు 21 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉంది. ప్రస్తుతం ఆమె ‘కన్నప్ప’ చిత్రంలో కనిపించింది. ఇందులో అక్షయ్ కుమార్, మోహన్లాల్, ప్రభాస్, విష్ణు మంచు కూడా నటించారు. ఆమె తదుపరి చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ఇందులో శ్రేయాస్ తల్పాడే కూడా ఉన్నాడు.
చేతన్ డి.కె దర్శకత్వంలో, ఎంఐజి ప్రొడక్షన్స్ అండ్ స్టూడియోస్ బ్యానర్పై సాగర్ బి షిండే నిర్మిస్తున్న ఈ మూవీ ఒక పురుగుమందుల కంపెనీలోని చీకటి కోణాలను అన్వేషిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. అంతేకాదు, ఎస్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇండియన్ 3’, నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ చిత్రాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి.
సంబంధిత కథనం