భారత్, చైనాలపై 500 శాతం సుంకం విధించనున్న అమెరికా? సెనేట్ బిల్లుకు ట్రంప్ ఆమోదం

Best Web Hosting Provider In India 2024


భారత్, చైనాలపై 500 శాతం సుంకం విధించనున్న అమెరికా? సెనేట్ బిల్లుకు ట్రంప్ ఆమోదం

Sudarshan V HT Telugu

ఒకవైపు భారత్ తో ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే ట్రేడ్ డీల్ ను కుదుర్చుకుంటున్నామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోవైపు భారత్, చైనాలపై 500 శాతం సుంకం విధించడానికి ఉద్దేశించిన బిల్లును సెనేట్ ముందు ఓటింగ్ కోసం తీసుకురావడానికి ఆమోదం తెలిపారు.

భారత్, చైనాలపై 500 శాతం సుంకం విధించనున్న అమెరికా? (AP)

రష్యా చమురు, ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేసే చైనా, భారత్ వంటి దేశాలపై 500 శాతం సుంకాలు విధించే సెనేట్ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఆంక్షల బిల్లును ఓటింగ్ కోసం తీసుకురావాలని ట్రంప్ తనతో చెప్పారని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ఆదివారం ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

రష్యాపై కోపంతో..

రష్యాపై కఠినమైన కొత్త ఆంక్షల బిల్లును గ్రాహం స్పాన్సర్ చేస్తున్నారు. ఉక్రెయిన్ పై చర్చల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఒప్పించడానికి, అందుకు ట్రంప్ కు “ఒక సాధనం” ఇచ్చే ప్రయత్నాలలో భాగంగా ట్రంప్ నిర్ణయం “పెద్ద పురోగతి” అని గ్రాహం అభివర్ణించారు. రష్యా నుండి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటే, ఉక్రెయిన్ కు సహాయం చేయకపోతే, యునైటెడ్ స్టేట్స్ లోకి వచ్చే మీ ఉత్పత్తులపై 500% సుంకం ఉంటుందని ఈ బిల్లులో పేర్కొన్నారు. రష్యా ఉత్పత్తి చేస్తున్న చమురులో 70 శాతం భారత్, చైనాలు కొనుగోలు చేస్తున్నాయి.

ట్రంప్ దే తుది నిర్ణయం

అయితే భారత్, చైనాలపై ఈ సుంకం విధింపునకు సంబందించి ట్రంప్ కు మినహాయింపు ఉందని గ్రాహం చెప్పారు. అది కాంగ్రెస్ ఆమోదం పొందితే చట్టంగా మార్చాలా వద్దా అనేది ట్రంప్ నిర్ణయించవచ్చని ఆయన నొక్కి చెప్పారు. ‘‘ఉక్రెయిన్ పై రష్యా క్రూరమైన ఆక్రమణకు చైనా, భారత్, రష్యాలకు వ్యతిరేకంగా ఆర్థిక బంకర్ బస్టర్ అయిన రష్యా ఆంక్షల బిల్లుకు నాకు 84 మంది సహ-స్పాన్సర్లు ఉన్నారు. ఆ బిల్లు పాస్ అవుతుందని భావిస్తున్నా’’ అని గ్రాహం గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రష్యా నుంచి దిగుమతులు

సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ప్రకారం, మే 2025 లో రష్యా శిలాజ ఇంధనాలను కొనుగోలు చేసిన రెండవ అతిపెద్ద దేశంగా భారతదేశం ఉంది. మే నెలలో రష్యా నుంచి భారత్ 4.2 బిలియన్ యూరోల విలువైన శిలాజ ఇంధనాలను కొనుగోలు చేసిందని, మొత్తంగా ముడిచమురు 72 శాతం ఉందని అంచనా వేసింది. గ్రాహం వ్యాఖ్యలపై రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ సోమవారం మాట్లాడుతూ అమెరికా సెనేటర్ వైఖరి గురించి రష్యాకు తెలుసునని, ఆయన ప్రకటనను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link