



Best Web Hosting Provider In India 2024
ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసుకెళ్లి, మద్యం తాగించి ఏడాదిగా విద్యార్థిపై లేడీ టీచర్ లైంగిక దాడి
గత కొన్నేళ్లుగా తన విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడుతున్న మహిళా టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లై పిల్లలున్న ఆ 40 ఏళ్ల టీచర్ తన 16 ఏళ్ల 11వ తరగతి విద్యార్థిని లోబర్చుకుని లైంగికంగా వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ముంబైలోని ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్ తన విద్యార్థిపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిందనే ఆరోపణలపై పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని ఆ టీచర్ గత ఏడాదిగా లైంగికంగా వేధిస్తోందని పోలీసులు తెలిపారు.
పెళ్లై పిల్లలున్నా..
పెళ్లై పిల్లలున్న 40 ఏళ్ల టీచర్ 16 ఏళ్ల 11వ తరగతి లోబర్చుకుని లైంగికంగా వాడుకున్న ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. 2023 డిసెంబర్ లో హైస్కూల్ వార్షిక ఫంక్షన్ కోసం డ్యాన్స్ గ్రూపులను ఏర్పాటు చేసే సమయంలో ఆమె తన విద్యార్థి పట్ల ఆకర్షితురాలైంది. 2024 జనవరి నుంచి అతడిని లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీచర్ ఆ విద్యార్థిని ‘‘మనం ఒకరి కోసం మరొకరం జన్మించాం’’ అని చెప్పేది. ఆ బాలుడిలో భయం పోగొట్టడం కోసం యాంటీ యాంగ్జైటీ మాత్రలు ఇవ్వడం ప్రారంబించింది. ఆ బాలుడు మొదట్లో విముఖత వ్యక్తం చేసి, ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు.
స్నేహితురాలితో చెప్పించి..
దీంతో టీచర్ ఆ స్కూల్ కు చెందని తన స్నేహితురాలిని పిలిపించి ఆ బాలుడిని ఒప్పించే బాధ్యత తనకు అప్పగించింది. పెద్ద వయస్సు స్త్రీలకు, టీనేజ్ అబ్బాయిలకు మధ్య లైంగిక సంబంధాలు సర్వసాధారణమని చెప్పి ఆ బాలుడిని ఆ స్నేహితురాలు ఒప్పించింది. ఆ తర్వాత ఆ విద్యార్థి టీచర్ ను కలవాలని నిర్ణయించుకున్నాడు. “ఆమె అతన్ని తన సెడాన్ కారులో ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా బట్టలు విప్పి లైంగిక దాడి చేసింది” అని ఒక పోలీసు అధికారి చెప్పారు.
యాంటీ యాంగ్జైటీ మాత్రలు
“తరువాతి కొన్ని రోజుల్లో విద్యార్థి తీవ్రమైన ఆందోళనకు గురైనప్పుడు, ఆమె అతనికి కొన్ని యాంటీ యాంగ్జైటీ మాత్రలు కూడా ఇచ్చింది” అని ఆ పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆ విద్యార్థిని దక్షిణ ముంబైలోని వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసుకెళ్లి, అక్కడ బలవంతంగా మద్యం తాగించి, ఆ తరువాత వరుస లైంగిక దాడులకు పాల్పడింది.
కుటుంబం తోడ్పాటు
ఇది ప్రారంభమైన కొన్ని నెలల తరువాత, విద్యార్థి కుటుంబం అతని ప్రవర్తనలో మార్పును గమనించి అతనితో మాట్లాడింది. అప్పుడే అతను వేధింపుల గురించి వారికి చెప్పాడు. అయితే, ఆ విద్యార్థి ఆ స్కూల్ లో చదువు ముగించడానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్నందున, ఆ తరువాత ఆ టీచర్ అతడిని వదిలేస్తుందన్న ఆశతో వారు దాని గురించి మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ బాలుడు బోర్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పాఠశాలను విడిచిపెట్టాడని, కానీ డిప్రెషన్ లో కూరుకుపోయాడని పోలీసులు తెలిపారు.
పోలీసు కేసు
ఆ తరువాత కూడా ఆ విద్యార్థిని కలవడం కోసం ఆ టీచర్ ప్రయత్నించడంతో ఆ విద్యార్థి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. “అప్పుడే కుటుంబం మమ్మల్ని సంప్రదించి కేసు పెట్టాలని నిర్ణయించుకుంది” అని అధికారి చెప్పారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని పలు సెక్షన్లు, భారతీయ న్యాయ సంహిత, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, సంరక్షణ) చట్టం, 2015లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link