శ్రీశైలానికి పెరుగుతున్న వరద – మరోసారి గేట్లు ఎత్తి నీటి విడుదల

Best Web Hosting Provider In India 2024

శ్రీశైలానికి పెరుగుతున్న వరద – మరోసారి గేట్లు ఎత్తి నీటి విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతోంది. రెండు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 76,143 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,21,996 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు సాగర్ కి వరద నీరు భారీగా చేరుతోంది.

శ్రీశైలం ప్రాజెక్ట్

భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మళ్లీ శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం పెరిగింది. దీంతో మరోసారి రెండు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు భారీగా ఔట్ ఫ్లో కూడా ఉండటంతో… నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

శ్రీశైలంలో పరిస్థితి ఇలా….

శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 883.80 అడుగులకు చేరుకుంది.ఇన్ ఫ్లో 76,143 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 1,21,996 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నీటినిల్వ 209.16 టీఎంసీలుగా నమోదైంది. ఈ సీజన్‌లో రెండోసారి గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 94,709 క్యూ సెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో7,531క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 572 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా…. ప్రస్తుత నీటి నిల్వ 261.59 టీఎంసీలుగా ఉంది.

ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల…

మరోవైపు ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం నాటికి 12,992 క్యూసెక్కుల నీరు బ్యారేజ్‌లోకి వచ్చి చేరింది. దీనితో అధికారులు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 12,992 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ లోని నీటిమట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ… అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

SrisailamSrisailam DamAndhra Pradesh NewsNagarjuna SagarKrmbKrishna River
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024