NEET PG result : నీట్​ పీజీ 2025 ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

Best Web Hosting Provider In India 2024


NEET PG result : నీట్​ పీజీ 2025 ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

నీట్​ పీజీ 2025 ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఆ ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

త్వరలోనే నీట్​ పీజీ 2025 ఫలితాలు..

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్​) త్వరలోనే నీట్​ పీజీ 2025 ఫలితాలను విడుదల చేయనుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన అభ్యర్థులు తమ స్కోర్‌ కార్డులను ఎన్​బీఈఎంఎస్​ అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in లో చెక్​ చేసుకోవచ్చు.

నీట్ పీజీ ఫలితాలు 2025: రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి?

ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు తమ నీట్​ పీజీ స్కోర్‌ కార్డులను ఎలా చూసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి..

స్టెప్​ 1- ముందుగా natboard.edu.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే NEET PG Results 2025 లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- లాగిన్ అవ్వడానికి మీ వివరాలను (క్రెడెన్షియల్స్) ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.

స్టెప్​ 4- తర్వాత, స్క్రీన్‌పై మీ నీట్ పీజీ ఫలితం కనిపిస్తుంది.

స్టెప్​ 5- భవిష్యత్తు అవసరాల కోసం ఆ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోండి.

స్టెప్​ 6- పరీక్ష వివరాలు & ముఖ్యమైన సూచనలు

నీట్​ పీజీ 2025 పరీక్ష ఆగస్ట్​ 3, 2025న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో జరిగింది.

పరీక్షలో మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. అభ్యర్థులు ఆ నాలుగు ఆప్షన్స్‌లో సరైన జవాబును ఎంచుకోవాలి. తప్పు సమాధానాలకు 25 శాతం నెగటివ్ మార్కింగ్ సైతం ఉంటుంది.

నీట్​ పీజీ 2025లో ప్రయత్నించని ప్రశ్నలకు ఎలాంటి మార్కులు తీయరు.

త్వరలో నీట్​ పీజీ 2025 ఫలితాలు- కటాఫ్​ పర్సెంటైల్​ ఎంత? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎన్​బీఈఎంఎస్​ హెచ్చరిక..

నీట్​ పీజీ 2025 నేపథ్యంలో ఎన్​బీఈఎంఎస్​ అభ్యర్థులకు ఇటీవలే ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. పరీక్షకు సంబంధించిన ఏ సమాచారాన్ని, ఎలాంటి ఉద్దేశ్యంతోనూ ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేసింది.

బోర్డు అధికారిక వాట్సాప్ ఛానెల్‌లో ఈ హెచ్చరికను జారీ చేసింది: “ఈ పరీక్షకు సంబంధించిన ఏ కంటెంట్‌ను కూడా, పాక్షికంగా లేదా పూర్తిగా, ఏ రూపంలోనైనా, మౌఖికంగా, రాతపూర్వకంగా, ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ పద్ధతుల్లో పునరుత్పత్తి చేయడం, పంపడం లేదా ప్రచురించడం వంటివి ఎన్​బీఈఎంఎస్​ పూర్తిగా నిషేధిస్తుంది.”

నీట్​ పీజీ 2025 పరీక్ష రాసిన అభ్యర్థులు, పరీక్ష ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో పొందుపరిచిన ఈ నాన్-డిస్‌క్లోజర్ ఒప్పందం గురించి తెలుసుకుని, దానికి అంగీకరించినట్లు ఎన్​బీఈఎంఎస్​ తెలిపింది.

నీట్​ పీజీ 2025 ఫలితాలపై మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link