అర్హత ఉండి పెన్షన్ రాలేదంటే కలెక్టర్లదే బాధ్యత – సీఎస్

Best Web Hosting Provider In India 2024

అర్హత ఉండి పెన్షన్ రాలేదంటే కలెక్టర్లదే బాధ్యత – సీఎస్

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్ అందాలని సీఎస్ స్పష్టం చేశారు. అర్హత ఉండి పెన్షన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యతన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని సూచించారు.

ఏపీ సీఎస్

రాష్ట్రంలో అర్హతగల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందించాలని సీఎస్ కె.విజయానంద్ స్పష్టం చేశారు. ఎక్కడైనా అర్హత ఉండి ఫించన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలక్టర్లదే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

తప్పనిసరిగా పెన్షన్ అందాలి – సీఎస్

పలు అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్… జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ముందుగా పింఛన్లు పంపిణీపై సీఎస్ మాట్లాడుతూ…. అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లుకు స్పష్టం చేశారు.ప్రతినెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా,మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు.

పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. అర్హత గలవారందరికీ తప్పనిసరిగా ఫించన్ అందేలా చూడలాని… అర్హత ఉన్నా ఫించన్ రాలేదని మీడియా,సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలక్టర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పునరుద్ఘాటించారు. పెన్షన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రసారం రాకుండా చూసుకోవాలని సీఎస్ సూచించారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Old Pension SchemeAp GovtAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024