రూ.90వేల వరకు జీతం- NIACL AO Recruitment 2025 రిజిస్ట్రేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​!

Best Web Hosting Provider In India 2024


రూ.90వేల వరకు జీతం- NIACL AO Recruitment 2025 రిజిస్ట్రేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu

ఎన్​ఐఏసీఎల్ ఏఓ​ రిక్రూట్​మెంట్​ 2025పై బిగ్​ అప్డేట్​! రూ. 90వేల వరకు జీతంతో కూడిన అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ పోస్టుల రిజిస్ట్రేషన్​కి ఈరోజే చివరి తేదీ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎన్​ఐఏసీఎల్ ఏఓ​ రిక్రూట్​మెంట్​ 2025

ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్​ఐఏసీఎల్​)లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 30, 2025తో ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్​ఐఏసీఎల్​ అధికారిక వెబ్‌సైట్ newindia.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​ చేసుకోవడానికి చివరి తేదీ దగ్గర పడింది కాబట్టి, అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ఎన్​ఐఏసీఎల్ ఏఓ​ రిక్రూట్​మెంట్​ 2025- ముఖ్యమైన తేదీలు, పరీక్ష వివరాలు..

ఈ పోస్టులకు మొదటి దశ (ఫేస్​ 1) ఆన్‌లైన్ పరీక్ష సెప్టెంబర్ 14న, రెండో దశ (ఫేస్​ 2) ఆన్‌లైన్ పరీక్ష అక్టోబర్ 29, 2025న జరుగుతాయి.

రిజిస్ట్రేషన్​ చేసుకోవడానికి, ముందుగా “Click here for New Registration” అనే టాబ్‌ను ఎంచుకుని, మీ పేరు, కాంటాక్ట్ వివరాలు, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, సిస్టమ్ ద్వారా ఒక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి. వాటిని భవిష్యత్ అవసరాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి. ఈ వివరాలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు.

ఎన్​ఐఏసీఎల్​ అడ్మిస్ట్రేటివ్​ ఆఫీసర్​ జీతం నెలకు రూ. 50,925 నుంచి రూ. 90వేల వరకు ఉంటుంది.

ఎన్‌ఐఏసీఎల్‌ ఏఓ రిక్రూట్‌మెంట్ 2025: దరఖాస్తు ఎలా చేయాలంటే..

అర్హత ఉన్న అభ్యర్థులు కింద తెలిపిన దశలను అనుసరించి దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టెప్​ 1- ముందుగా ఎన్‌ఐఏసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్ newindia.co.in ఓపెన్ చేయండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే “కెరీర్స్” లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీకు “అప్లై ఆన్‌లైన్” లింక్ కనిపిస్తుంది.

స్టెప్​ 4- ఆ లింక్‌పై క్లిక్ చేసి, మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.

స్టెప్​ 5- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను నింపి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

స్టెప్​ 6- “సబ్మీట్” బటన్‌పై క్లిక్ చేసి, దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్​ 7- భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.

ఎన్​ఐఏసీఎల్​ ఏఓ రిక్రూట్​మెంట్​ 2025- దరఖాస్తు ఫీజు వివరాలు..

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ (వికలాంగ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100/-. ఈ కేటగిరీకి చెందని ఇతర అభ్యర్థులకు ఫీజు రూ.850/-. ఫీజును డెబిట్ కార్డ్స్ (రూపే/వీసా/మాస్టర్‌కార్డ్/మేస్ట్రో), క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్/మొబైల్ వాలెట్స్ ద్వారా చెల్లించవచ్చు.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎన్‌ఐఏసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఎన్​ఐఏసీఎల్​ ఏఓ రిక్రూట్​మెంట్​ 2025 రిజిస్ట్రేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link