




Best Web Hosting Provider In India 2024

ఏపీ డిగ్రీ అడ్మిషన్లు : రిజిస్ట్రేషన్ కు దగ్గరపడిన గడువు – సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?
ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ గడువు రేపటితో పూర్తి కానుంది. అర్హులైన ఇంటర్ విద్యార్థులు.. వెంటనే రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈ గడువు రేపటితో (సెప్టెంబర్ 1) పూర్తి కానుంది. కాబట్టి ఈలోపు అర్హులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే గడువు పొడిగించిన నేపథ్యంలో… మరోసారి పొడిగించే అవకాశం లేదు.
ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఈ గడువు సెప్టెంబర్ 2వ తేదీతో పూర్తవుతుంది. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే… సెప్టెంబర్ 3వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చు. వీరికి సెప్టెంబర్ 6వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయి.
డిగ్రీ కోర్సుల్లో చేరుందుకు ఆసక్తి గల విద్యార్థులు https://oamdc.ucanapply.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు రూ.400, బీసీలు రూ.300 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 ఫీజును కట్టాలి. ఆన్ లైన్ ద్వారానే ఈ ఫీజును చెల్లించాలి.
ముఖ్యమైన వివరాలు:
- డిగ్రీలో ప్రవేశాలకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- సెప్టెంబర్ 1 తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
- అప్లికేషన్ ఫీజు – ఓసీలు రూ.400, బీసీలు రూ.300 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 కట్టాలి.
- స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహిస్తారు.
- సెప్టెంబర్ 2వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు కాలేజీలను ఎంచుకోవాలి.
- వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ – 3 సెప్టెంబర్ 2025.
- సెప్టెంబర్ 6న సీట్ల కేటాయింపు ఉంటుంది.
- రాష్ట్రంలో సెప్టెంబరు 8వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయి.
- అధికారిక వెబ్ సైట్ – https://oamdc.ucanapply.com/?appid=OAMDC
ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా… రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్