అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

Best Web Hosting Provider In India 2024

అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

Anand Sai HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Anand Sai HT Telugu

అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐబీఎం (REUTERS)

అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది సీఆర్డీఏ. ప్రభుత్వ సంస్థగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ) అయింది.

వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలు ఉండనున్నాయి. 2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్ , 5కె గేట్స్ క్యాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకు వచ్చింది. భద్రమైన నెట్‌వర్కింగ్, అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను క్వాంటం వ్యాలీకి ప్రభుత్వం అందించనుంది.

చదరపు అడుగుకు రూ.30కే అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్ ను ప్రభుత్వానికి ఐబీఎం సంస్థ కేటాయించనుంది.

ప్రభుత్వ సంస్థలు, విద్య పరమైన అంశాలకు ఈ కంప్యూటింగ్ టైమ్ ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో రూ.6 కోట్ల వ్యయంతో మరో చిన్న క్వాంటం కంప్యూటర్‌ను బెంగుళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ క్యూపై ఏఐ ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్ నిర్మించేందుకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీనికి ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న ఎల్ అండ్ టీతో ఒప్పందాలు జరిగాయి. ఈ ప్రాజెక్టులోకి ఐబీఎం కూడా అడుగుపెట్టింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఐబీఎం తన క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Anand Sai

eMail
ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

AmaravatiAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024