గణేష్ నిమజ్జనం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు.. హైదరాబాద్‌కు అమిత్ షా!

Best Web Hosting Provider In India 2024

గణేష్ నిమజ్జనం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు.. హైదరాబాద్‌కు అమిత్ షా!

Anand Sai HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Anand Sai HT Telugu

సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనున్నంది. దీంతో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు కరెంట్ వైర్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ హైదరాబాద్‌లో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్‌లు, వీధి దీపాలను వేగవంతం చేస్తోంది. ఖైరతాబాద్ బడా గణేష్ సెప్టెంబర్ 6న శోభాయాత్రగా వెళ్లి నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.

మరోవైపు బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత ప్రధాన ఊరేగింపు ప్రారంభమై నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్‌ రానుంది. బాలాపూర్ గణేష్ విగ్రహ ఊరేగింపు ప్రారంభమైన తర్వాత, ఇతర విగ్రహాలు ఏకకాలంలో వాటి మండపాల నుండి తమ ఊరేగింపును ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు. చార్మినార్, ఎంజే మార్కెట్ వంటి కీలక ప్రదేశాల వద్ద ప్రధాన ఊరేగింపులో చేరతాయి. ఆ తర్వాత ఊరేగింపు హుస్సేన్ సాగర్‌కు వెళుతుంది. అక్కడ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ బాలాపూర్ గణేష్‌ను సందర్శించి అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు ఏర్పాట్లను పరిశీలించారు.

గుంతలు, దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయడానికి రోడ్డు భద్రతా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గణేష్ విగ్రహ నిమజ్జనంపై చర్చించడానికి పోలీసు శాఖ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంయుక్త సమీక్షా సమావేశాన్ని నిర్వహించాయి.

గణేష్ నిమజ్జానానికి అమిత్ షా

సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు హైదరాబాద్ పర్యటనకు రాబోతున్నారు. సెప్టెంబర్ 6న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ కు వస్తారు. 11.30 గంటల నుంచి 12.30 వరకు ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటలకు చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు ఎంజే మార్కెట్ దగ్గర శోభాయాత్రలో పాల్గొని ప్రసంగిస్తారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమిత్ షా పర్యటన ఉండటంతో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి.

Anand Sai

eMail
ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

HyderabadAmith ShahTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024