పుణ్యక్షేత్రాల్లో హోమ్ స్టేలు, అనంతపురంలో డిస్నీ వరల్డ్ సిటీ.. ఏపీ టూరిజంపై చంద్రబాబు సూపర్ ప్లాన్

Best Web Hosting Provider In India 2024

పుణ్యక్షేత్రాల్లో హోమ్ స్టేలు, అనంతపురంలో డిస్నీ వరల్డ్ సిటీ.. ఏపీ టూరిజంపై చంద్రబాబు సూపర్ ప్లాన్

Anand Sai HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Anand Sai HT Telugu

పుణ్యక్షేత్రాలు ఉన్న చోట్ హోమ్ స్టేలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ టూరిజానికి బూస్ట్ ఇచ్చే విధంగా పలు కీలక విషయాలపై చర్చించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (@AndhraPradeshCM X)

టెంపుల్ టౌన్స్‌లో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే హోమ్‌స్టేలను ప్రోత్సహించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తిరుపతితోపాటుగా ఇతర ప్రముఖ దేవాలయాలు ఉన్న పట్టణాల్లో వీటిపై దృష్టి పెట్టాలన్నారు. ఈ చొరవ యాత్రికులకు ప్రయోజనం చేకూర్చడం, ఆలయ పర్యాటకాన్ని పెంచడం లక్ష్యంగా ఉంటుందన్నారు. కోనసీమ ప్రాంతంలో హోమ్‌స్టేలను ప్రోత్సహించాలని, ఈ ప్రయత్నంలో ఎన్నారైలను పాల్గొనేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను చెప్పారు.

పది వేల గదులు

బుధవారం అమరావతిలోని సచివాలయంలో పర్యాటక రంగాన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పలు కీలక విషయాలపై చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి, అనంతపురం, కర్నూలు వంటి కీలక నగరాల్లో పర్యాటక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వేర్వేరు పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టుల బస కోసం హోటల్ గదులను సిద్ధం చేయాలని చెప్పారు. పర్యాటకుల సౌలభ్యం కోసం మార్చి 2026 నాటికి పది వేల గదులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

డిస్నీ వరల్డ్ సిటీ

175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అనంతపురంలో డిస్నీ వరల్డ్ నగరాన్ని ఏర్పాటు చేయడం, ప్రైవేట్ పార్టీల సహకారంతో కొండపల్లి ఖిల్లాను అభివృద్ధి చేయడం, ఉండవల్లి గుహలలో లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేయడం, చింతపల్లిలో ఎకోటూరిజాన్ని ప్రోత్సహించడం, కుప్పంలో ఎలిఫెంట్ సఫారీ నిర్వహించడం, విశాఖపట్నంలో డాల్ఫిన్ షో నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

సూర్యలంక బీచ్

సూర్యలంక బీచ్‌ ఎక్స్‌పీరియన్స్ ప్రాజెక్ట్ పనులను రూ. 97 కోట్ల వ్యయంతో చేపట్టామని, 2026 జూన్ నాటికి ప్రాజెక్టు సిద్ధం అవుతుందన్నారు సీఎం. అరకు, లంబసింగిలో అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండికోట, అరకు, లంబసింగి, ఇతర ప్రదేశాలలో టెంట్ హౌస్ నగరాలను అభివృద్ధి చేయాలన్నారు. అలాగే రాజమండ్రిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ-శ్రీశైలం, గండికోట-బెంగళూరు, విశాఖ-అరకులను కలిపే హెలి, సీప్లేన్ టూరిజానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అన్నారు.

స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన

మైసూర్ దసరా వేడుకల మాదిరిగానే విజయవాడలో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని అధికారులను ఆదేశించారు. అరకు కాఫీ, ఎర్ర చందనం బొమ్మలు, కూచిపూడి నృత్యం, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి చేనేత వస్త్రాలను బ్రాండింగ్ చేయడానికి పర్యాటకాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని చెప్పారు.

Anand Sai

eMail
ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

TirupatiChandrababu NaiduAnantapurTourismAp TourismNri NewsNri News Usa Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024