




Best Web Hosting Provider In India 2024

ఉద్ధృతంగా కృష్ణా, గోదావరి నదులు – ప్రమాద హెచ్చరికలు జారీ..! అత్యవస సాయం కోసం ఈ నెంబర్లను సంప్రదించండి
ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.83 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇవాళ రాత్రి లేదా రేపటికి దాదాపు రెండవ హెచ్చరిక స్ఠాయికి కృష్ణా వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
మరోవైపు గోదావరి నది వరద భద్రాచలం వద్ద 44.5 అడుగులు ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 10.14 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి హెచ్చరిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇవాళ దాదాపుగా 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేశామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. క్షేత్రస్థాయిలో అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి 24/7 అందుబాటులో ఉండాలని సూచించింది. ఎప్పటికప్పుడు ప్రజలకు అలెర్ట్ మేసేజ్లు పంపిస్తున్నట్లు తెలిపింది.
టోల్ ఫ్రీ నెంబర్లు…
అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించవచ్చు. కృష్ణా, గోదావరి నదీపరీవాహక, లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించింది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు…
మరోవైపు ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. బుధవారం నాటికి ఉత్తర, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
సంబంధిత కథనం
టాపిక్
