నల్గొండ జిల్లాలో పండగపూట విషాదం – వాగులో మునిగి ముగ్గురు మృతి

Best Web Hosting Provider In India 2024

నల్గొండ జిల్లాలో పండగపూట విషాదం – వాగులో మునిగి ముగ్గురు మృతి

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. డిండివాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిని తెనాలికి చెందిన గోపీ, సాయికాంత్‌,రాము గా గుర్తించారు.

ఈతకు వెళ్లి ముగ్గురు మృతి (Pixabay )

దసరా పండగ కోసమని బంధువుల ఇంటికి వచ్చారు. అయితే సరదాగా పక్కన ఉన్న వాగులోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు 9 ఏళ్ల బాలుడు వాగులో మునిగిపోయాడు. ఇతడిని కాపాడేందుకు యత్నించిన మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని చందంపేట మండలంలో జరిగింది.

ప్రాథమిక వివరాల ప్రకారం…ఈ ఘటన చందంపేట మండలం దేవరచర్లలో చోటు చేసుకుంది. డిండివాగులోకి వెళ్లగా… ముగ్గురు మృతి చెందారు. ముందుగా 9 ఏళ్ల ఉమాకాంత్ మునిగిపోగా… ఇతడిని కాపాడేందుకు రాము(30), భరత్ కుమార్ (21) ప్రయత్నించారు. వీరు కూడా వాగులో కొట్టుకునిపోయి.. ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు…స్థానికలు సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన వాసులుగా గుర్తించారు. దసరా పండగ కోసం బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

సంతోషంగా పండగ జరుపుకునే వేళ… ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోవటంతో కుటుంబంలోనే కాకుండా రెండు గ్రామాల్లోనూ విషాదం నెలకొంది. కుటుంబ సబ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Crime NewsTelangana NewsNalgondaGuntur
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024