ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి- ఆరోజు సాయంత్రం నుంచి స్ట్రీమింగ్- అధికారిక ప్రకటన

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి- ఆరోజు సాయంత్రం నుంచి స్ట్రీమింగ్- అధికారిక ప్రకటన

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి స్ట్రీమింగ్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి జోడీగా నటించిన కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మరికొన్ని రోజుల్లో సాయంత్రం నుంచి కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆ ఓటీటీ ఏంటంటే?

ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి- ఆరోజు సాయంత్రం నుంచి స్ట్రీమింగ్- అధికారిక ప్రకటన

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి హీరో హీరోయిన్లుగా జోడీ కట్టిన సినిమా కిష్కింధపురి. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

సంచలన విజయం

కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ హారర్-థ్రిల్లర్ కిష్కింధపురి థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసి ప్రేక్షకులను అలరించింది. హారర్ థ్రిల్లర్ అభిమానులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించిన కిష్కింధపురి ఓటీటీలోకి వచ్చేయనుంది.

ఇప్పటికే కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్‌పై పలు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఇవాళ (అక్టోబర్ 10) కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఒకటైన జీ5లో కిష్కింధపురి ఓటీటీ ప్రీమియర్ కానుంది.

కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్

అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా ఓటీటీ రిలీజ్ డేట్ అర్థరాత్రి నుంచే సినిమాలను స్ట్రీమింగ్ చేస్తారు. కానీ, కిష్కింధపురి మూవీని మాత్రం సాయంత్రం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి రేడియో స్టేషన్ నేపథ్యంలో సాగుతుంది. వెన్నులో వణుకు పుట్టించే ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో వచ్చిన ఈ చిత్రం ఇక ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్దమైంది.

కఠినమైన పాత్రల్లో ఒకటి

ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ .. “నేను పోషించిన అత్యంత కఠినమైన పాత్రలలో ఇది ఒకటి. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు సెట్‌లో మన ముందు ఎలాంటి భయానక పరిస్థితులు ఉండవు. కానీ, మేం మాత్రం ఊహించుకుని అలా నటించాల్సి వస్తుంది. నటుడిగా, అది నన్ను నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకువచ్చినట్టు అయింది” అని అన్నారు.

“సెట్‌లో నేను నిరంతరం భయం, అనిశ్చితి వాతావరణంలో జీవించాల్సి వచ్చింది. రేడియో స్టేషన్ వింతైన వాతావరణం నాతో పాటు ఇంకా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఓటీటీలో కూడా ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను” అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలిపారు.

రకరకాల ఎమోషన్స్‌ను పోషించే

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ .. “కిష్కింధపురిలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. రకరకాల ఎమోషన్స్‌ను పోషించే అవకాశం నాకు ఈ చిత్రంతో దక్కింది” అని చెప్పారు.

“ఇందులో నా పాత్ర ‘హారర్ హీరోయిన్’ స్టీరియోటైప్ పాత్ర కాదు. కొన్ని సార్లు భయపడుతుంది, ఇంకొన్ని సార్లు కృంగిపోతుంది.. మరి కొన్ని సార్లు తనని తాను ప్రశ్నించుకుంటుంది.. మళ్లీ వెంటనే రెట్టింపు శక్తితో పైకి లేస్తుంది. నా పాత్రకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను” అని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు.

వింతైన అనుభవం

“నాకు, ఆ వెంటాడే ప్రదేశాలలో షూటింగ్ అనేది ఒక వింతైన అనుభవం. మన చుట్టూ ఉండే వాతావరణం కూడా మనల్ని మన పాత్రల్లోకి లోతుగా నెట్టివేస్తున్నట్లు అనిపించింది” అని పేర్కొన్నారు అనుపమ పరమేశ్వరన్.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024