నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

monditoka jagan mohan rao

monditoka arun kumar

ysrcp nandigama

monditoka jagan mohan rao
ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల :

నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

కంచికచర్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా రూ.కోటి పది లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు గురువారం శంకుస్థాపన నిర్వహించారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాడు -నేడు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలలు- కళాశాలలు- ఆస్పత్రుల రూపురేఖలు మార్చి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేలా అభివృద్ధి చేస్తున్నారని , విద్యార్థుల చదువులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసేలా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు ,ఈ కళాశాల ప్రాంగణంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని , ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగిందని , త్వరలోనే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ,

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్ , జడ్పిటిసి ,ఎంపీటీసీ సభ్యులు , మండల పార్టీ అధ్యక్షులు , కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు , పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *